ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించండి.
ఆసుపత్రికి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తాం.
ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు సమకూరుస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. గురువారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, జిజిహెచ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, వైద్యశాలలోని వివిధ విభాగాల అధిపతులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు అవసరమైన పరికరాల ఏర్పాటుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులనుండి వినియోగించుకోవాలని సూచించారు. గత రెండు సంవత్సరాల నుండి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగలేదని ఇప్పటినుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి అవసరమైన పరికరాలు, వైద్య సిబ్బంది తదితర అంశాలపై చర్చించి అవసరమైన నిధులు సమకూర్చుకొని అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. గతంలో పెండింగ్ ఉన్న ఎలక్ట్రికల్, ప్లంబరింగ్, స్టేషనరీ, సిసి కెమెరాల ఏర్పాటు తదితర బిల్లులకు సంబంధించిన నిధులను ఆమోదించామన్నారు. ఆసుపత్రికి అవసరమైన తాగునీటి సౌకర్యాన్ని అమృత స్కీం కింద ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ చర్చిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదాలకు సంబంధించిన పరికరాలు, స్వచ్ఛ సుగం శానిటేషన్ కింద టాయిలెట్లు ఏర్పాటుకు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జన ఔషధ కేంద్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ సర్వజన వైద్యశాలలో ఉన్న వసతులను మరింత పటిష్టం చేసుకుని వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ఆస్పత్రిలో నీటి కొరత లేకుండా మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రికి అవసరమైన వైద్య పరికరాలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకొని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. హాస్పిటల్ కు అన్ని విధాల సపోర్టు ఇచ్చి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ప్రతిరోజు 1000 నుండి 1200 మంది నిరుపేదలు వైద్యం కోసం వస్తుంటారని వారందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు.
పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ సేవలకు సంబంధించిన అవసరమైన అత్యవసర పరికరాలను ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి అన్ని విధాలా సహకరించి వైద్య వృత్తికి అన్ని విధాల న్యాయం చేసి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యాధికారులను కోరారు. గతంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం కరువైందని ఆసుపత్రికి అవసరమైన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బెడ్ స్కాన్ కు మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. మురుగునీటి నిలువ, పిచ్చి మొక్కలు, పందులు, దోమలకు ఆవాసంగా అపరిశుభ్రతకు నిలయంగా జిల్లా స్థాయి ఆసుపత్రి ఉండడం బాధాకరమని మంచి వాతావరణం ఆసుపత్రి ఆవరణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో డిసిహెచ్ఎస్ జఫ్రుల, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక