ఆంధ్రప్రదేశ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 91 ఫిర్యాదులు

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం… కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్
•ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 91 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) నేను ఎమ్మిగనూరు బ్రాంచ్ – యూనియన్ బ్యాంకులో బిజినెస్ కరెస్పాండ్ గా పని చేస్తున్నాను. మే 17 న నా ఫోన్ నెంబర్ కు సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి మొబైల్ బ్యాంక్ యాప్ ద్వారా నా మొబైల్ ను హ్యాక్ చేసి రూ. 5 లక్షలు ఆన్ లైన్ ఫ్రాడ్ చేశారని యూనియన్ బ్యాంక్ లోని నా ఖాతా నుండి డబ్బులు కాజేశారని, నాకు న్యాయం చేయాలని ఎమ్మిగనూరు మండలం, కోటేకల్లు గ్రామానికి చెందిన ఇబ్రహీం ఫిర్యాదు చేశారు.
2) కర్నూలు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లో నా కుమారుడికి, నా కుమార్తె కు ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలు, వెంకటరమణ కాలనీ కి చెందిన ఆయేషా బేగం, జహీర్ లు రూ. 5 లక్షల 75 వేలు తీసుకొని మోసం చేశారని కర్నూలు , వివేక నగర్ కు చెందిన ఉదయ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ హామీ ఇచ్చారు.
ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ గుణశేఖర్ బాబు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక