ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛతహి సేవా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు.
మంగళవారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులచే స్వచ్ఛతా హి ప్రతిజ్ఞ చేయించి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. మన చుట్టూ పరిసర ప్రాంతాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి తమ వంతు బాధ్యతగా స్వీకరించాలన్నారు. నీరు నిల్వ వున్న ప్రదేశాలను గుర్తించి వాటిని పరిశుభ్రం చేయడంతోపాటు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఇక్కడ చెత్త వెయ్యరాదన్న భావన అందరిలో కలిగేలా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలపై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావాలన్నారు. షాపింగ్ కాంప్లెక్సులు, దుకాణాలు, రోడ్లపై చెత్త వేయడం, ఇళ్లలోని చెత్తను శుభ్రపరిచి కాలువల్లో వేయడం మానుకోవాలని ఆమె తెలిపారు. రహదారులు, మురికి కాలువలు శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని వాళ్ళ ఆరోగ్య రక్షణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. నంద్యాల జిల్లాను స్వచ్ఛ జిల్లాగా మార్పు చేసేందుకు ప్రజలు, విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. జిల్లాలో ప్రముఖ దేవాలయాలు, ఎకో టూరిజం ప్రదేశాలు ఉన్నాయని, ప్రక్క రాష్ట్రాల నుంచి నంద్యాల జిల్లాకు వచ్చే సందర్శకులకు ఆహ్లాదం, ఆనందంగా కలిగించేలా స్వచ్ఛతను పాటించాలని జిల్లా ప్రజలను కలెక్టర్ సూచించారు..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక