ఆంధ్రప్రదేశ్
కార్మికుల సంక్షేమమే ‘ప్రధాన అజెండా

కార్మికుల సంక్షేమమే ‘ప్రధాన అజెండా
• 9 తీర్మానాలకు నగరపాలక స్థాయీ సంఘం ఆమోదముద్ర
• రూ.1.67 కోట్ల నిధుల ఖర్చుకు పచ్చజెండా
• కార్పొరేటర్లకు, ఉద్యోగులకు కార్మికులకు జీవిత బీమా
• క్లాప్ ఆటో డ్రైవర్లకు 4 నెలల వేతనాలు చెల్లింపు
• చిరుద్యోగులకు దుస్తులు, టవల్స్, చెప్పులు, నూనె, సబ్బుల పంపిణీ
• కింగ్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్లో రెండు షాపులకు వేలంపాట
• ముఖ్య కూడళ్లలో సిసి కెమెరాల ఏర్పాటు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమమే ప్రధాన అజెండాగా నగరపాలక స్థాయి సంఘ సమావేశం జరిగింది. నగర మేయర్ బి.వై. రామయ్య అధ్యక్షతన బుధవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన స్థాయి సంఘం సమావేశానికి కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఆమోదించిన 9 లో 5 తీర్మానాలు కార్మికులకు సంబంధించినవే కావడం విశేషం. సాధారణ నిధుల నుండి రూ.1,67,18,000 కోట్ల నిధుల వినియోగానికి స్థాయి సంఘం ఆమోదముద్ర వేసింది. నగరపాలక కార్పొరేటర్లకు, అధికారులకు, రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి, కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు బీమా వర్తించేలా రూ.520 లతో జీవిత బీమా చేయుట, అలాగే రూ.45.50 లక్షలతో కార్మికులకు దుస్తులు, టవల్స్, చెప్పులు, నూనె, సబ్బులు సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కింగ్ మార్కెట్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందు లీజు కాలం ముగిసిన ఒక షాపు, ఖాళీ అయిన మరో షాపుకు బహిరంగ వేలంపాట నిర్వహణ, క్లాప్ ఆటో డ్రైవర్లకు 4 నెలల వేతనాల చెల్లింపు, ముఖ్య కూడళ్లలో సిసి కెమెరాల ఏర్పాటు వంటి తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో సభ్యులు ఎం.విక్రసింహారెడ్డి యూనూస్ బాష, క్రాంతి కుమార్, జుబేర్, మిద్దె చిట్టమ్మ, ఆరోగ్యధికారి డా.వి.విశ్వేశ్వర్ రెడ్డి, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, ఎస్ఈ వేణుగోపాల్, ఎంఈలు షాకీర్, శేషసాయి, ఆర్ఓలు జునైద్, ఇశ్రాయోలు, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, సూపరింటెండెంట్ మంజూరు బాషా, సినియర్ అసిస్టెంట్ జిఎం శ్రీకాంత్, డిఈ కృష్ణలత, టిపిఆర్ఓ రంగస్వామి, ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన తీర్మానాలు..
1. కింగ్ మార్కెట్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందు 25 ఏళ్ళ లీజు కాలం పూర్తి అయిన షాపు నెం.52/150-P ను, అలాగే ఖాళీ చేసిన 52-150-E షాపులను బహిరంగ వేలం నిర్వహించుటకు గ్రీన్ సిగ్నల్.
2. నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు, అధికారులకు, సిబ్బందికి, రెగ్యులర్ & అవుట్ సోర్సింగ్ కార్మికుల, ఆరోగ్య భద్రతా దృష్టిలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా వర్తించేలా ఆరోగ్య భీమా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లిమిటెడ్ వారికి ఒక్కొక్కరి రూ.520 లు చెల్లింపునకు ఆమోదముద్ర వేశారు.
3. నగరంలో పనిచేస్తున్న 1155 మంది శాశ్వత, ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా 350 గ్రాముల పారాషూట్ నూనె, డిటర్జెంట్ సబ్బులు ఏడాది కాలం పాటు పంపిణీ చేయుటకు అగు రూ.22.50 లక్షలను మంజూరు చేస్తూ ఆమోదించారు.
4. 1515 మంది నాల్గవ తరగతి ఉద్యోగులకు రెండు జతల దుస్తులు, చెప్పులు, టవల్స్, స్త్రీలకు 3 చీరలు, 3 రవికలు (బ్లౌస్లు), 3 టవల్స్, రెండు జతల చెప్పులు పంపిణీ చేయుటకు లేపాక్షి హ్యాండీ క్రాఫ్ట్ ఎంపోరియమ్ వారికి రూ.23 లక్షలను కేటాయించారు.
5. విద్యుత్ దీపాల మరమ్మత్తు సిబ్బందిని మరో ఏడాది పాటు కొనసాగించటానికి రూ.38 లక్షలను మంజూరు చేశారు.
6. నగరంలో ముఖ్య కూడళ్లలో సిసి కెమెరాల ఏర్పాటుకు రూ.40 లక్షలను కేటాయించారు.
7. క్లాప్ ఆటో డ్రైవర్ల వేతన బకాయిలలో నెలలకు సంబంధించి రూ.43,68,000 లక్షలను నగరపాలక సాధారణ నిధుల నుండి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక