ఆంధ్రప్రదేశ్
బిజెపి,శివసేన నాయకులు రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలి.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
రాహుల్ గాంధీ పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ,శివసేన(షిండే వర్గం)నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నూనెపల్లె సెంటర్ బ్రిడ్జి దగ్గర నిరసన తెలుపుతూ బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు దాసరి చింతలయ్య మాట్లాడుత- రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత
రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ , అమిత్ షా లు పట్టించుకోవడం వెనుక కుట్ర దాగి వుందన్న అనుమానం కలుగుతోందన్నారు.ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతుందని అన్నారు.ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.విద్వేష పూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ దేశంలో ఎవరు తీవ్రవాదులు ?
ఏది తీవ్రవాదం ?ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు 90 శాతం మంది ఉన్నారు.వాళ్లకు అభివృద్ధి లో వాట లేదు అని చెప్పడం అని తీవ్రవాదమా,అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని రాహుల్ గాంధీ చెప్పడం తీవ్రవాదమా ?
ఏది తీవ్రవాదమో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ,త్యాగాలు చేసింది కాంగ్రెస్పార్టీఅన్నికులాలను,మతాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్నారు.
రాహుల్ గాంధీని తీవ్రవాది అంటున్నారు.ఈ దేశంలో ప్రేమను నింపిన నాయకుడు రాహుల్ గాంధీని అన్నారు. అలాంటిరాహుల్ గాంధీ పేరు ఉచ్చరించే హక్కు బీజేపీ కి లేదన్నారు.బీజేపీ అంటే మతతత్వ పార్టీ బీజేపీ మత చిచ్చు పార్టీ ,బీజేపీ తీవ్రవాదుల పార్టీ మతాల మధ్య చిచ్చుపెట్టి అందులో చలి కాచుకోవాలని చూస్తున్న బీజేపీ నీ హెచ్చరిస్తున్నాం , మర్యాదగా రాహుల్ గాంధీ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.లేదంటే బిజెపి నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు .ఈకార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య, అధికారప్రతి నిది ఊకోటు వాసు, ఆనంద్ రావు, ప్రసాద్, రవి, పాలరాజ్ ,సలాం, హమ్మద్ మొదలగు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక