ఆంధ్రప్రదేశ్
వరల్డ్ ఫుడ్ ఇండియా’ లో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్

‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ లో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖామాత్యులు టి.జి. భరత్ ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం నందు, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మరియు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరా శాఖ మంత్రి ప్రల్హద్ జోషి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఏ.పీ. పెవిలియన్ ను మంత్రి టి.జి. భరత్ సందర్శించారు. ఈ పెవిలియన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ మరియు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఆహారోత్పత్తి రంగంలో సాధిస్తున్న ప్రగతి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ పెవిలియన్ ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్రం వరి, మిర్చి మరియు అక్వా సాగులో దేశంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. అరకు కాఫీ వంటి బ్రాండ్లు, శ్రీ సిటీలోని కాడ్బరి కోకో శుద్ధి యూనిట్ లాంటి పరిశ్రమలు మరిన్ని నెలకొల్పబడి, అభివృద్ధి చెందేలా అనుకూల వ్యవస్థను ఏర్పరుస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న 9 ఫుడ్ పార్క్స్ లో సంబంధిత పరిశ్రమలకు కావల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, విజన్ తో పరిశ్రమలు మరియు ఆహార రంగానికి సంబంధించి దేశంలోనే అత్యుత్తమ విధానాలను (పాలసీ) రూపొందించే పనిలో తమ శాఖ నిమగ్నమై ఉన్నదని పేర్కొన్నారు. వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్ లో
ఆహార శుద్ధి రంగానికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక