ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మంత్రి టి.జి భరత్ చేతులమీదుగా సీఎంఆర్ఎఫ్కు విరాళం*

దాతలను అభినందించిన మంత్రి టి.జి భరత్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకురావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీ.ఎం.ఆర్.ఎఫ్ కు మంత్రి టి.జి భరత్ చేతులమీదుగా క్రెడాయ్ కర్నూల్ చాప్టర్ తరుపున రూ. 6.50 లక్షలు విరాళం అందించారు. కర్నూలు నగరంలోని కార్యాలయంలో మంత్రి టి.జి భరత్ ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతలను మంత్రి టి.జి భరత్ అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో చిన్నసహాయమైనా ఎంతో ఉపయోగపడుతుందని టి.జి భరత్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులను ఆదుకునేందుకు నిద్రాహారాలు పక్కనపెట్టి కష్టపడ్డారని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ క్రెడాయ్ సభ్యులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక