ఆంధ్రప్రదేశ్
వాటర్ ప్లాంట్ మరియు సర్పంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ .

నంద్యాల పట్టణంలోని స్థానిక చాపిరేవుల గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మరియు సర్పంచ్ కార్యాలయాన్ని ముఖ్యఅతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి తులసి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చాపిరేవుల గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉండి చాపిరేవుల గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని కోరారు. అనంతరం ఇక్కడ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం అని తాగునీటిని అందరికీ అందించడం మంచి ఉద్దేశమని అన్నారు అలాగే ఇక్కడ సర్పంచ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా కార్యాలయానికి వచ్చి వారి సమస్యను తెలపడానికి సులువుగా ఉంటుందని అన్నారు .ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు చాపిరేవుల టిడిపి నాయకులను ప్రజలను అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ డిఎన్ రాజు , బిజ్జల బాలస్వామి రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , భూపాల్ రెడ్డి , రామకృష్ణారెడ్డి , పులిమద్ది సుబ్బరాయుడు , మారెళ్ళ సంజీవ , మంటి రాజశేఖర్ , గంటల నాగరాజు , అప్పుపోగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87487