Connect with us

ఆంధ్రప్రదేశ్

క్యూ ఆర్ కోడ్‌ స్కాన్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించండి

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

స్వర్ణాంధ్ర@2047″ లక్ష్య సాధన దిశగా జిల్లా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించండి.

క్షేత్ర స్థాయి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయండి.

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

స్వర్ణాంధ్ర@2047 దార్శనిక పత్ర రూపకల్పనలో భాగంగా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా, మండల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా స్వర్ణాంధ్ర@2047 ప్రణాళికపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ ఏ. పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని కీలక రంగాలపైన దృష్టి సారించి జిల్లా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి స్వర్ణాంధ్ర@2047 విజన్ అభివృద్ధి రూపకల్పనపై చర్చించడంతో పాటు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ఇంటింటికి సమాచారం అందించి అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు, రైతులు, యువత నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి జిల్లా అభివృద్ధి ప్రణాళికలో భాగస్వాములను చేయాలన్నారు. స్వర్ణాంధ్ర@2047 ప్రణాళిక రూపకల్పనకు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రజల అభిప్రాయాలను స్వీకరించి వివరాలను పొందుపరిచే విధంగా చర్యలు తీసుకొని అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సహాయ గణాంక అధికారులు ఎంపీడీవోలకు సహకారం అందించి మంచి ప్రణాళికతో డాక్యుమెంట్ రావాలని సూచించారు. రానున్న ఐదు సంవత్సరాలలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు మండల విజన్ ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోగా రూపొందించాలన్నారు. జిల్లా విజన్ ప్రణాళికలను అక్టోబర్ 15వ తేదీలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
వంద రోజులలో సాధించిన విజయాలపై ఇది మంచి ప్రభుత్వం లోగోను ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది ద్వారా చేరవేయాలన్నారు. నిర్దేశించిన రోజువారీ లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గత మూడు రోజుల నుండి ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమాలలో తాను పాల్గొన్నానని ప్రతిచోట ప్రజలు చిన్న చిన్న సమస్యలపై అనేక ఫిర్యాదులు బహిరంగంగా చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఏమాత్రం బాధ్యత లేకుండా విధులు నిర్వహించడం స్పష్టంగా కనిపిస్తోందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోతున్నారని… చెబితే తప్ప పనులు చేయరా అని కలెక్టర్ ప్రశ్నించారు. చేయకూడని పనులను మిమ్మల్ని చేయమని చెప్పడం లేదని డిపార్ట్మెంట్ల వారీగా నిర్వర్తించాల్సిన విధులపై కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తమ దృక్పథాన్ని మార్చుకొని పనుల్లో నాణ్యత, నిబద్ధత కనపడకపోతే ఏ మాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం స్వర్ణాంధ్ర@ 2047 పోస్టర్ ను ఆవిష్కరించారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580527
Total Users : 48211