ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో 3-12 లోపు పిల్లలకు యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ఖుర్ఆన్ కంఠస్థ ప్రతిభా పోటీలు.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
10వ రాష్ట్ర స్థాయి ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో భాగంగా నంద్యాలలో 3-12 ఏళ్ళు మధ్యగల చిన్నారులకు ఖుర్ఆన్ కంఠస్థ ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ కన్వీనర్ సి.యం.జకరియా తెలిపారు. ఈ సంధర్భంగా క్రాంతి రేఖ గ్రంధాలయం లో ఆయన స్థానిక జమాఆతె ఇస్లామీ హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమద్,
జిల్లా ఐటా అధ్యక్షులు హాఫీజ్ ముహమ్మద్ షోయబ్ జమా, ఖిద్మత్ మేనేజర్ ముహమ్మద్ ఫయాజ్ , అబ్దుల్ ఖాదర్ జీలాని, ముహమ్మద్ షఫీ తొ కలిసి కరప్రత్రాలు విడుదల చేసారు. మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ అంచెలంచెలుగా జరిగే ఈ పోటీల క్వార్టర్ ఫైనల్ నంద్యాలలో 15డిశంబర్ నిర్వహిస్తామని విద్యార్థులు అక్టోబర్ 15 లోపు ఆన్లైన్ లేదా ఆయా స్కూలు ప్రధాన ఉపాధ్యాయుల వద్ద అప్లే చేయవచ్చు అన్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్ధికి సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు క్వార్టర్ ఫైనల్లో నెగ్గిన పిల్లలకు మెడల్, సర్టిఫికేట్, ఖుర్ఆన్, జానిమాజ్ బహుకరిస్తారు. 26 జనవరిలో సెమి ఫైనల్ అనంతపూర్ లోనూ, ఫైనల్ పోటీలు 8ఫిబ్రవరి విజయవాడాలోను నిర్వహిస్తామన్నారు. ఫైనల్ లో ప్రతిభ చాటిన ముగ్గురికి ప్రథమ,ద్వితియా, తృతీయ బహూమతిగా రూ.20వేలు, 15వేలు, 10వేలు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తలిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులలో ప్రతిభ వెలుగులోకి తీసుకొని రావటానికి ప్రోత్సహించాలని ముస్లిం నాయకులు విజ్ఞప్తి చేశారు. వివరాలకు సీ.యం.జకరియా (8555989159)ను సంప్రదించాలని తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక