Connect with us

ఆంధ్రప్రదేశ్

పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వ పాలన.

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం.

టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్.

పేదల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. గురువారం నాడు స్థానిక నందమూరి నగర్ నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కరపత్రాలను, స్టిక్కర్లను ఎన్ఎండి ఫయాజ్ , మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కలిసి స్థానిక నాయకులు, అధికారులు ప్రతి ఇంటికి అందించారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ, 100 రోజులు పూర్తిచేసుకున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో 64 లక్షలు మంది సామాజికి పింఛన్ దారులకు 3 వేల రూపాయలు నుంచి 4 వేల రూపాయలకు పెన్షన్ పెంచడమే కాక 3 నెలల బకాయిలను కలిపి 7 వేలు రూపాయలు అందించామన్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు 5 రూపాయలకే నాణ్యమైన ఆహరం అందించేందుకు అన్నా క్యాంటిన్లను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 16 వేల 700 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ని ప్రకటించారని, దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ చేస్తామని, మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం పథకంను అమలు చేస్తామన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు ఎన్ఎండి ఫయాజ్ తెలిపారు. అలాగే స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు ఇచ్చి పంచాయతీల అభివృద్దికి ఊపిరి పోశారన్నారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్”ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారని ఫయాజ్ గుర్తుచేశారు. విజయవాడ నగరం వరదలలో విలవిలలాడుతున్నప్పుడు, 74 ఏళ్ల వయస్సు లో 10 రోజుల పాటు బస్సులో ఉండి, నిద్రాహారాలు మాని, వరద ప్రభావం తగ్గేవరకు ఉండి వరద బాధితులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పధంలో నడపడానికి గొప్ప విజన్ నాయకుడు, పరిపాలన దక్షతకలిగి దూరదృష్టి ఉన్న నాయకుడు మనకు ముఖ్యమంత్రి గా ఉన్నందున అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుకు దూసుకెళుతుందన్నారు . అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుండి అర్హత కలిగిన పెన్షన్ దారులకు పెన్షన్ మంజూరు చేసేలా గ్రామ సభలు నిర్వహించి పెన్షన్ లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో 37 వ వార్డు టిడిపి ఇంచార్జ్ మరియు మాజీ కౌన్సిలర్ మామిడి ఉషారాణి , మామిడి నాగరాజు కుమార్ , నంద్యాల టిడిపి పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్ , కౌన్సిలర్ నాగార్జున , తాటికొండ బుగ్గ రాముడు , ఉమాకాంతయ్య , లక్ష్మీనారాయణ , షేక్ షబ్బీర్ భాష , షేక్ ఖలీల్ భాషా , చంద్రశేఖర్ , దుర్గాప్రసాద్ , మరాఠీ సూరి , ప్రతాప్ రెడ్డి , శరత్ , అడ్వకేట్ బాబురావు , తాటికొండ మహేష్ , వెంకటస్వామి ,ఇమామ్ హుస్సేన్ , వడ్డే నాగేంద్ర , సత్యరాజు , రమేష్ రెడ్డి , దిలీప్ కుమార్ (ఢిల్లీ) , సౌభాగ్య , సుజాత , రాజేశ్వరి , మాధవి మరియు మున్సిపల్ సిబ్బంది , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580498
Total Users : 48182