ఆంధ్రప్రదేశ్
మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అభివృద్ధి చేసే ప్రభుత్వం.. కార్యకర్తలకు అండగా ఉంటాం…ఎంపి నాగరాజు,టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి

ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం (కోసిగి) రిపోర్టర్:
తెలుగుదేశం పార్టీ అంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అభివృద్ధి చేసే ప్రభుత్వమని కర్నూలు ఎంపీ బస్తిపాటి.నాగరాజు, మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్రారెడ్డి అన్నారు.గురువారం స్థానిక కోసిగి రేణుక ఎల్లమ్మ దేవి ఆవరణలో ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హజరైయ్యారు.టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.మౌంట్ కార్మెల్ స్కూల్ నుండి బైక్ ర్యాలీతో బయలుదేరి యల్లమ్మ గుడి దగ్గరకు చేరుకొని యల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. మేజర్ సర్పంచ్ కూమరి అయ్యమ్మ తమ గ్రామానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేసి కోసిగి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేయాలని కోరారు.అలాగే కోసిగి మీదుగా వెళ్లే పలు రైళ్లు ను నిలుపుదల చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని ఆమె కోరారు. టిడిపి నాయకులు వంద రోజుల పాలనలో తమ ప్రభుత్వం చేసిన పనిని ప్రజలకు వివరించారు.తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పెంపు పై చెప్పిన మాటకు కట్టుబడి ఓకే సారి అవ్వాతాతల వెయ్యి రూపాయలు పెంచడం కాకుండా అరియర్స్ తో కలిపి అవ్వాతాతలకు ఏడు వేలు రూపాయలను తమ ప్రభుత్వం అందించిందని తెలిపారు.
చంద్రబాబు నాయుడు సహకారంతో మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.కోసిగిలో ప్రధాన సమస్యయైనా రైల్వే గేటు పై రైల్వే బ్రిడ్జి నిర్మించి ఇక ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తామని హమి ఇచ్చారు.ఎపి మోడల్ స్కూల్ ను సందర్శించారు.తరగతి గదిలో స్లాబ్ నుంచి పెచ్చులూడి కింద విద్యార్థులపై పడే అవకాశం ఉందిని వాటి పరిష్కారానికి కృషి చేయాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చిన నాయకులు వినతి పత్రం అందజేశారు.అదే విధంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి అధ్యాపక బృందం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాలేజీలో నెలకొన్న సమస్యలపై అధ్యాపకులు,విద్యార్థులు వివరించారు.కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లక్ష్మన్న,బిజెపి మండలాధ్యక్షుడు రాముడు, టిడిపి నాయకులు రాకేష్, అయ్యన్న,నాడిగేని తాయన్న, తోవి రామక్రిష్ణ,జ్ఞానేష్, చింతలగేని నరసరెడ్డి,బిజెపి నాయకులు,టిడిపి నాయకులు,జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక