ఆంధ్రప్రదేశ్
ప్రైవేట్ పాఠశాల,కళాశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలి (video)

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
నిభందనలు పాటించని ప్రైవేట్ పాఠశాల,కళాశాలపై తనిఖీలు చేపట్టాలి
విద్యార్థులతోపాటు బోధన సిబ్బందికి సెలవులు ఇవ్వాలి
చాంద్ బాషా,ఆంధ్రప్రదేశ్,ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ (పిటిఎల్ యు) జిల్లా అధ్యక్షులు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాల, కళాశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని,ప్రభుత్వ నిభందనలు పాటించని ప్రైవేట్ పాఠశాల,కళాశాలపై ప్రభుత్వ యంత్రాంగం తనిఖీలు చేపట్టాలని,విద్యార్థులతోపాటు బోధన సిబ్బందికి సెలవులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్,ప్రైవేట్ టీచర్స్,లెక్చరర్స్ యూనియన్ (పిటిఎల్ యు) జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందచేశారు.అనంతరం చాంద్ బాషా విలేకరులతో మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి,బోధనపై మమకారంతో బోధన వృత్తిని ఎంచుకుని, విద్యార్థుల అభ్యున్నతి కొరకు నిరంతరం కృషి చేస్తూ విద్యాసంస్థల ఎదుగుదల కొరకు శ్రమిస్తున్నట్లు చెప్పారు.ప్రైవేట్ టీచర్ లు,లెక్షరర్ లకు సెలవురోజు కూడా సెలవు ఉండదన్నారు.రోజుకు 10 నుండి 12 గంటలు నిలువు కాళ్ళ మీద నుంచొని పనిచేస్తున్నామని చెప్పారు.ప్రతి నెలకు అల్ప జీతానికి దాదాపు 50శాతం టీచర్లు పనిచేస్తున్నట్లు ఆవేదన చెందారు.పి.ఎఫ్. ఇ.ఎస్.ఐ.వంటి సదుపాయాలు కూడా ఉండవన్నారు.ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు.వీధుల వెంటతిరిగి పిల్లలను చేర్పించాలి.ఫీజులు కట్టకపోతే ఫీజుల కోసం తల్లితండ్రులకు ఫోన్లు చేసి ఫీజులు కట్టించాలి.అస్సలు చదువురాని వాళ్ళకు కూడా ర్యాంకులు తెప్పించే విధంగా బోధన ఇవ్వాలి.కాని కనీస గౌరవం కూడా ఉండదన్నారు.ఇంత చేసినా ప్రతిరోజు తిట్లు,అవమానాలు, వెక్కిరింతలతో పాటు సామర్థ్యంపై కూడా అనుమానాలు.ఇంకా చిత్రం ఏమిటంటే మనకు ఉద్యోగం కావాలంటే మన ఒరిజనల్ సర్టిఫికేట్స్,ఖాళీ చెక్కులు, ఖాళీ ప్రామిసరినోట్ల మీద సంతకాలు పెట్టించుకుని మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చెప్పారు.రాష్ట్రంలోని ప్రైవేటు టీచర్లకు,లెక్చరర్లకు సమయానికి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.ప్రభుత్వ టీచర్లకు ఉన్న అన్ని హక్కులు,నిబంధనలు,జి.ఒలు ఉన్న యాజమాన్యాలుగాని,అధికారులు గాని అస్సలు పట్టించుకోరని పేర్కొన్నారు.
ప్రైవేటు,కార్పొరేట్ సెక్టార్లోని ఉపాధ్యాయులు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు.దీంతో తమ జీవితాలు ఒక మెట్టు కూడా ఎదగకుండానే,చదువు ద్వారా ఏర్పడవలసిన నైతిక విలువలు సమాజంలో నాశనమవుతున్నాయని చెప్పారు.కావున ప్రభుత్వ నిబంధనల మేరకు తమ హక్కులతో పాటు,విద్యా వ్యవస్థను,విద్యార్థుల నైతిక విలువలను కాపాడే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.మరోవైపు ప్రభుత్వ అధికారుల తనిఖీలు లేకపోవడంతో సంస్థలు విచ్చలవిడిగా నిబంధనలకు పొడుస్తున్నాయని ఆవేదన చెందారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ పాఠశాలలు,కళాశాలలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని,అదేవిదంగా కార్మిక చట్టాల మేరకు టీచర్ లు,లెక్షరర్ లకు వేతనాలు,సెలవులు,పిఎఫ్,ఈ ఎస్ ఐ వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో టీచర్ లు, లెక్షరర్ లను కలుపుకొని పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ సిద్దరాముడు,నగర అధ్యక్షులు అఫ్జల్ బాషా,తదితరులు పాల్గొన్నారు.
Continue Reading
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక