ఆంధ్రప్రదేశ్
సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో 94.19 శాతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పూర్తి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
అభివృధ్ధితో పాటు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మొత్తాలను ఉదయం 6 గంటలకే లబ్ధిదారులకు అందిస్తున్నామని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని 12 వార్డు ఖలీల్ టాకీస్ పక్క సందులో నాలుగో నెల ఇంటి వద్దకే వచ్చి, ఒకటో తారీఖునే పింఛన్ ను పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫించన్ దారులతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతు చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది, ఫింఛన్ ఎంత వస్థోంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవగానే ఇచ్చిన మాట ప్రకారం ఫించన్ పెంచాడని, రాష్ర్టాన్ని అభివృధ్ధిలో నడపడం మొదలెట్టాడని, సంక్షేమంతో పాటు అభివృధ్ధి చేసి చూపిస్తున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకపక్క అభివృద్ధితో పాటు మరోపక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీ గ్రామాల్లో పింఛన్లు పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. వందరోజుల పాలనలో పింఛన్లు పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, దీపావళికి మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నంద్యాల పట్టణం లోని ఎస్బిఐ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అందజేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లాలో 2,05,5 43 మందికి పింఛన్ పంపిణీ చేసి 94.19 శాతం పెన్షన్లను పంపిణీ పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక