ఆంధ్రప్రదేశ్
కర్నూల్లో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తా.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్

రిడ్జ్ స్కూల్లో ఏపీ, తెలంగాణ సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్ పోటీలను ప్రారంభించిన మంత్రి
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
కర్నూల్లో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగర శివారులోని రిడ్జ్ స్కూల్లో ఏపీ, తెలంగాణ సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ ఇంటర్ స్కూల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థులను పరిచయం చేసుకొని ఫుట్ బాల్ ఆడారు. అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుండి 150 పాఠశాలలు ఈ పోటీల్లో పాల్గొనడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇలాంటి పెద్ద క్రీడా పోటీలు హైదరాబాద్, వైజాగ్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతాయని.. అయితే ఈ పోటీలకు కర్నూలుకు చెందిన రిడ్జ్ పాఠశాల వేదికవ్వడం గర్వకారణమన్నారు. క్రీడాకారులకు ఎలాంటి అన్ని వసతులు కల్పిస్తూ పోటీలను విజయవంతంగ నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. క్రీడలకు యూఎస్, చైనా, యూరప్ దేశాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయన్నారు. మన దేశంలో కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటీవలె తాను కేంద్ర మంత్రిని కలిసి కర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు గుర్తు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. చదువు మాత్రమే కాకుండా క్రీడల్లో కూడా పాల్గొనేలా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ఇక కర్నూల్లో క్రీడలకు తమ టిజివి సంస్థల తరుపున అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం తరుపున కూడా క్రీడల అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర సంస్థల వ్యవస్థాపకులు పుల్లయ్య, మోహన్ కుమార్, గోపినాథ్, వల్లపురెడ్డి జనార్థన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక