ఆంధ్రప్రదేశ్
మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలి.

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
నూతన మద్యం పాలసీని సవరణ చేయాలి .
రాష్ట్రంలోగతంలో మాదిరిగానే మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నూతనముగా తీసుకొచ్చిన పాలసీని సవరణ చేయాలనీ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపుమేరకు నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి అధ్యక్షతన గాంధీ విగ్రహంనిరసన ప్రదర్శన చేపట్టడము జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ఎస్ షమీం బేగం ,జిల్లా ప్రధాన కార్యదర్శిజి రజిత ,జిల్లా ఉపాధ్యక్షురాలు మృతుజాబి ,డోన్ లక్ష్మీదేవి. పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానం వల్ల వీధి వీధినా మద్యం ఏరులై పారుతుందని పాఠశాలలు, కళాశాలలు, ప్రార్ధన మందిరాలు దగ్గర ఏర్పాటు చేసిన మద్యం షాపులను రద్దు చేయాలని, ఎక్కడపడితే అక్కడ మద్యం షాపులను ఏర్పాటు చేయడం వలన బాలికలకు, మహిళలు రహదారుల వెంట వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందాని ఆరోపించారు.
ఇప్పటికీ మహిళలపై దాడులు హత్యాచారాలకు బాధపడుతున్నారని ఇక నూతన మద్యం పాలసీతో ఎక్కడపడితే అక్కడ మద్యం లభిస్తుందని, మద్యం మత్తులో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే అందుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని వారు ప్రశ్నించారు.
ప్రభుత్వం తక్కువ ధరకే మద్యం అమ్మేందుకు చూపిస్తున్న శ్రద్ధ నిత్యవసరాల ధరలు పెరిగి ప్రజలు విలవిలలాడుతుంటే పెరిగిన ధరలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం శోచనీయమని వారన్నారు. ప్రజలను తాగుబోతులుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చూస్తుందని వారు ఎద్దేవా చేశారు.
మద్యానికి బానిసై ఎందరో ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రజలను మద్యానికి దూరంగా ఉంచాల్సిన ప్రభుత్వం మద్యం తక్కువ ధరకు అందిస్తాం తాగండి అని ప్రోత్సహించడం చూస్తుంటే ప్రభుత్వానికి ఆదాయమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం నూతన మద్యం విధానం రద్దుచేసి మద్యానికి బానిసలైన వారి కోసం అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిఅడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పై నాయకురాలు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ గోస్పాడ్ మండల కార్యదర్శి. జి హరినాథ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు షిరిన్, మున్ని, మాధవి ,సూర్య, పద్మావతి,షమీనా,లతా, రామలక్ష్మీ, లక్ష్మీదేవి,అరుణ,తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక