ఆంధ్రప్రదేశ్
ఉక్కు పరిశ్రమను నిర్మించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించండి.

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ.
జిల్లా నాయకుడు గాలి రవిరాజ్.
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించి నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించి వలసలను కరువును నివారించాలని నూతన ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ సిపిఐ (యం యల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ స్పందిస్తూ,
ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక శ్రద్దతో జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కృషిచేసి నిరుద్యోగ,యువతీ యువకులకు ఉపాధి కల్పనకు తోడ్పాటు ఇస్తామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్, మహానంది మండల నాయకుడు చంద్రుడు లు మాట్లాడుతూ
రాయలసీమ ప్రాంతం కరువు, వలసలు,రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది అన్నారు. ఇలాంటి రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను స్థాపించి,ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలని గత కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో సెక్షన్ 8(II) పొందుపరచి పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని నేటి మన దేశ ప్రధాని నరేంద్ర మోది తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీ ఇవ్వడం జరిగిందని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోది సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తరుణంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్గా పలు రకాల ఉద్యమాలు, ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరిగిందని తెలిపారు . విశాఖ ఉక్కు ఉద్యమాల వత్తిడితో గతంలో (2018)లో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడం జరిగిందని,ఎన్నికల తరువాత ప్రభుత్వం మారడం జరిగిందని అలాగే గతంలో (2018) ప్రతిపక్షంలో వున్న వై.యస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోను ఎన్నికల ప్రచార సందర్భంలోను మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల లోపు శంకుస్థాపన చేసి సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని, కడప జిల్లా ప్రజానీకానికి హామీ ఇచ్చారని, 2019 లో అధికారంలోకి వచ్చిన తరువాత వై.యస్. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనకే పరిమితమై ఉక్కు పరిశ్రమ పనులను ప్రారంభించకుండా, నిధులను కేటాయించకుండా జగన్ సర్కార్ 5 సంవత్సరాలు పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి జిల్లా ప్రజానీకాన్ని నిరుద్యోగ యువతీ,యువకులను ఘోరంగా మోసం చేసిందని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి అయితే ప్రత్యక్షంగా 10,000 వేలు మంది నిరుద్యోగులకు పరోక్షంగా 25,000 వేలు మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని,అలాగే ఈ పరిశ్రమకు అనుబంధంగా మరీ కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది, వీటి చుట్టూ రవాణా వ్యవస్థ (లారీలు, బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు మొదలగునవి) హోటల్స్ , లాడ్జీలు, టూరిజం, కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు, వివిధ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు బాగా అభివృద్ధి చెంది, వీటి ద్వారా కూడా కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు,
కాబట్టి ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన ఎన్ డి ఏ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి వెంటనే ఉక్కు పరిశ్రమను నిర్మించి,నిరుద్యోగ యువతీ యువకుల వలసలను నివారించి వారికి ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశం కల్పించి, రాష్ట్ర ప్రజల చిరకాల కళ స్వప్నాన్ని నెరవేర్చాలని, రాష్ట్ర ప్రజల నిరుద్యోగ యువతీ, యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి నిధులు కేటాయించి, ఉక్కు పరిశ్రమను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీగా ఆయన విజ్ఞప్తి చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక