ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్ )ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
విచారణ జరిపి చట్ట పరిదిలో న్యాయం చేస్తాం.
జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్.
నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 07-10-2024) నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఫిర్యాదిదారుల నుంచి 86 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని , ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని , ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు ప్రతి సోమవారం మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్, డిఎస్పి కార్యాలయాల్లో జరిగే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక “కార్యక్రమంలో ఫిర్యాదు చేయవచ్చని వాటిని కూడా పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ ఎన్.యుగంధర్ బాబు కూడా పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక