ఆంధ్రప్రదేశ్
విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని జీవో 117 రద్దుపరిచి ఉన్నత పాఠశాలలో విలీనమైన 3,4,5 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించాలని అలాగే డిఇఓ పూల్ లో ఉండే భాషా పండితులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని, బోధనానుభవం ఉన్న ప్రధానోపాధ్యాయులతోనే జిల్లా విద్యాశాఖాధికారి, ఉప విద్యాశాఖాధికారుల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఉపాధ్యాయులు తెలియజేసినటువంటి సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకొని వెళ్లి వాటిని పరిష్కరించడానికి సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు .దీని ద్వారా విద్యారంగంలో నెలకొన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్తు అధికార ప్రతినిధి ముత్తోజు వీరబ్రహ్మం , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. ఎం. షరీఫ్, సంఘ నేతలు అన్నెం శ్రీనివాసరెడ్డి, ఎమ్ .వి.ప్రసాద్ నీలం వెంకటేశ్వర్లు, మాబు భాష, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక