ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి.

గైరాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు.
పిజిఆర్ఎస్ కు 210 విజ్ఞప్తులు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ ఎ. పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పిజిఆర్ఎస్ గైరాజరైన వికలాంగుల శాఖ ఏడి, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్, ఎక్సైజ్, గనుల శాఖ అధికారి, స్కిల్ డెవలప్మెంట్ , ఉప రవాణా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. పిజిఆర్ఎస్ కు 90 శాతం సమస్యలు రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యలే అధికంగా వస్తున్నాయని వీఆర్వో, ఆర్ఐ, డీటీలు డిజిటల్ కీ ద్వారా వెబ్ ల్యాండ్ లో మారుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డి పట్టాలు మంజూరు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నామని పేర్లు మార్చాడానికి మీరెవరని కలెక్టర్ ప్రశ్నిస్తూ టైటిల్ డిక్లేర్ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. పొరంబోకు రస్తా స్థలాలపై డి పట్టా ఇచ్చిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒత్తిడిలకు లోనై నిబంధనలను అతిక్రమిస్తే వృత్తికే ప్రమాదం ఏర్పడుతుందని ఆమె హెచ్చరించారు. ఇటీవల జరిగిన భూ బదలాయింపులో నిబంధనలు అతిక్రమించిన అధికారికి మూడు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేశామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ రికార్డుల మేరకు నిజమైన కక్షిదారులకు చేయాల్సిన పనులపై శ్రద్ధ పెట్టి పనులు చేయాలని ఆమె సూచించారు. చేయలేని వారికి మాత్రం సరైన కారణాలు చూపి ఎండార్స్ ఇవ్వాలన్నారు. రెవెన్యూలో చట్ట వ్యతిరేకంగా పనులు చేసి బదిలీ అయినా రిటైర్డ్ అయిన సంబంధిత అధికారులను వెంటాడుతూ క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పిజిఆర్ఎస్ లో కొన్ని సమస్యలు.
1) గోస్పాడు మండలం బీసీ కాలనీకి చెందిన పెద్ద సుబ్బయ్య తనకు కాలు విరిగిందని ఒంటి కాలితో పనులు చేసుకోలేకపోతున్నానని ప్రభుత్వం తరుపున మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ తో పాటు వికలాంగుల పెన్షన్ ఇప్పించగలరని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
2) జూపాడుబంగ్లా మండలం 80 బన్నూరు మరియు కొత్త సిద్దేశ్వరం గ్రామాలలో నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలు తమకు ఉపాధి హామీ పథకం ద్వారా 150 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
3) శిరివెళ్ళ మండలం గోవింద పల్లె లో నూతన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ పాఠశాల (బాలురు)ను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల ప్రజలు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో 210 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక