ఆంధ్రప్రదేశ్
రాయితీ పై పప్పు శనగ విత్తనాలు పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

రాయితీ పై పప్పు శనగ విత్తనాలు పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల స్థానిక టెక్ కేర్ మార్కెట్ యార్డ్ నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ చేతుల మీద నంద్యాల నియోజకవర్గ రైతులకు వ్యవసాయ శాఖ తరపున రాయితీ పై పప్పు శనగల విత్తనాల పంపిణీ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను నంద్యాల మండలానికి 186 క్వింటాల్ ల జేజి11 రకం శనగ విత్తనాలు కేటాయించడం జరిగినది. ఈ విత్తనాలను గుంతనాల, మిట్నాల, పుసులూరు, పులిమద్ది, భీమవరం ఊడు మాల్పురం మరియు మూలసాగరం గ్రామాలకు కేటాయించడం జరిగినది. ఈ విత్తనం యొక్క పూర్తి ధర క్వింటాల్ కి 9,400 రూపాయలు కాగా 25 శాతము సబ్సిడీ 2,350 రూపాయలు పోను 7,050 రూపాయలు రైతు వాటాగా చెల్లించాలి. రైతు వాటాగా ఒక్క 20 కేజీ ల బస్తా కి 1,410 రూపాయలు చెల్లించాలి. ఎకరాకి 2 బస్తాలు చొప్పున 5 ఎకరాలకు 10 బస్తాలు వరకు ఒక్కో రైతుకు ఇవ్వడం జరుగుతుంది. విత్తనాలు కావలసిన రైతులు సమీప రైతు సేవా కేంద్రమును సందర్శించి రిజిస్ట్రేషన్లు చేయించుకొని శనగ విత్తనాలు పొందగలరని తెలియజేయజేశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ వ్యవసాయమే మన రాష్ట్రానికి ముఖ్యమైన జి.డి.పి. వనరు అని రైతు బాగుంటే అందరూ బాగుంటారని రైతులతో మరియు వ్యవసాయ అధికారులతో త్వరలో సమావేశము ఏర్పాటు చేసి రైతులకు కావలసిన ఎరువులు కాని విత్తనాలు కానీ, వ్యక్తిగత యంత్ర పరికరాలు సబ్సిడీ పై కానీ ఒక నివేదిక తయారు చేసు అతి త్వరలో ముఖ్యమంత్రి తో మాట్లాడి అన్ని మంజూరు చేయించి రైతుల అభివృద్ధి కోసం తోడ్పడుతామని తెలియజేసారు. అలాగే మార్కెట్ యాడ్ షాపుల విషయంలో రెండు నెలలు టైం అయినా కూడా ఇంతవరకు ఖాళీ చేయలేదని మార్కెట్ యార్డ్ అధికారులు షాపులను తీసుకొని వ్యవసాయానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కార్యాలయాలను ఓపెన్ చేయాలని రైతులకు ఉపయోగపడే విధంగా వాటిని వినియోగించాలని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మార్కెట్ యార్డ్ అధికారులకు వ్యవసాయ అధికారులకు సూచించారు.
మార్కుఫెడ్ మెంబెర్ తులసి రెడ్డి మాట్లాడుతూ జొన్నల కొనుగోలు కానీ యూరియా, డి.ఏ. పి ఎరువులు కానీ కొరత లేవని ఇంకా అవసరమైతే వెంటనే తెప్పుస్తామని తెలియజేసారు. రైతులకు వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథ రెడ్డి , చాపిరేవుల భూపాల్ రెడ్డి, గోస్పాడు మండల కన్వీనర్ తులసి రెడ్డి , తెల్లపురి, యం. కృష్ణా పురం బాలేశ్వర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెలిగొండా రెడ్డి , ఈశ్వర్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి, వై.వి మురళికృష్ణ , సహాయ వ్యవసాయ సంచాలకులు డి.రాజశేఖర్ , వ్యవసాయ అధికారులు ప్రసాద రావు , స్వప్నికా , ఇతర వ్యవసాయ శాఖ సిబ్బంది నంద్యాల మరియు గోస్పాడు మండల రైతులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక