ఆంధ్రప్రదేశ్
తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు*

తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కర్నూలు నియోజకవర్గంలోని 9, 12వ వార్డులకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి కార్యాలయంలో వీరు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి టి.జి భరత్ 9వ వార్డు కార్పొరేటర్ పుల్లమ్మ, 12వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ అన్నెపోగు క్రాంతి కుమార్లకు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతోనే వైసీపీని వీడి కార్పొరేటర్లు తమ పార్టీలోకి వస్తున్నట్లు చెప్పారు. కేవలం తనకు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే వైసీపీ నేతలు కర్నూలు అభివృద్దిని అడ్డుకుంటున్నారన్నారు. పలువురు కార్పొరేటర్లు నిజానిజాలు తెలుసుకొని తమ పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు. రానున్న ఐదేళ్లలో కర్నూలు రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు.
అనంతరం పార్టీలో చేరిన కార్పొరేటర్లు మాట్లాడుతూ వార్డుల్లో అభివృద్ధి మంత్రి టి.జి భరత్తోనే సాధ్యమవుతుందన్నారు. కర్నూలును అభివృద్ధి చేయాలన్న తపన మంత్రి టి.జి భరత్కు ఉందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అందుకే వైసీపీని వీడి టిడిపిలో చేరుతున్నామన్నారు. పార్టీలో చేరిన వారిలో నవీన్, ఆనంద్ తదితరులు ఉన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక