ఆంధ్రప్రదేశ్
పందిపాడు ఇందిరమ్మ కాలనీకి మౌలిక సదుపాయాలు సహకరించండి

పందిపాడు ఇందిరమ్మ కాలనీకి అభివృద్ధికి సహకరించండి
కాలనీవాసుల ఆవేదన
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

oplus_131072
కర్నూలు జిల్లా కల్లూరు మండలం పరిధిలో
పందిపాడు ఇందిరమ్మ కాలనీ వెలసింది. ఈ కాలానికి పేరు కూడా లేకపోవడంతో పంది పాడు ఇందిరమ్మ కాలనీ అని పిలుస్తున్నారు.ఇక్కడ నివాసం ఉంటున్న పేదలు దైనందిన జీవితంలో అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.2009 వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిరమ్మ కాలనీ పేరిట సుమారు 2500 మంది పేదలకు ఇక్కడ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ముజాఫర్ నగర్ సమీపంలో ఈ ఇందిరమ్మ కాలనీ ఉంది.అయితే 15 సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని కనీసం మౌలిక వసతులు కల్పించలేదంటున్నారు.నిత్యం నరకం అనుభవిస్తు పేద ప్రజలు తల్లడిపోతున్నారు. నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కొందరు పేదల అక్కడ ఇళ్లు కట్టుకోవడం జరిగింది. అయితే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారు.విద్యుత్ దీపాలు సరిలేక కారు చీకట్లో నగర శివారున అనునిత్యం బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. రాజకీయ నాయకులు గానీ అధికారులు కానీ తమను పట్టించుకోవట్లేదని తమ సమస్యలు వినట్లు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలవేళ ప్రతిసారి నాయకులు తమ వద్దకు వచ్చి చేతులు ఎత్తి ఓట్లు అడుగుతున్నారే తప్ప తమ సమస్యలను అయితే మాత్రం నేతలు తమ ఇంటి కాంపౌండ్ లోకి కూడా రానియడం లేదంటున్నారు. విన్నవించుకున్న ప్రతిసారి చూద్దాం… చేద్దాం…. అంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. గత 15 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్ని మారిన నాయకులు ఎందరు వచ్చిన అందరికీ వినతి పత్రాలు అందిస్తూ వస్తున్నా… జిల్లా కలెక్టర్లకు అర్జీలు పెడుతున్న కూడా ఫలితం లేకుండపోయిన్దంటున్నారు.
కాలనీ కీ రోడ్లు. తాగు నీరు, డ్రైనేజి సమస్యలు ఎవరికీ కూడా చెవికి ఎక్కడం లేదంటున్నారు. ఈ కాలనీలో అనేకమంది పేదలు పునాదుల వరకు కట్టుకొని ప్రభుత్వ సహకారం లేక ఇంటి నిర్మాణాలు ఆపేసుకున్నారు.అప్పులు చేసి ఇళ్ళు నిర్మించుకొనినష్టపోమని చెప్తున్నారు. హౌసింగ్ కార్పొరేషన్ అందించాల్సిన బిల్లు కూడా సరిగా అందించలేదంటున్నారు. ఇంటి నిర్మాణ విషయంలో ప్రభుత్వం సరైన సహకారం అందించకపోవడంతో ఇల్లు కట్టుకోలేక ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు మొలిసాయి.పాములు, తేలు తిరుగుతున్నాయని భయం భయంగా జీవిస్తున్నామంటున్నారు. పిల్లలు బడికి పంపించిదానికి చాలా ఇబ్బందిగా ఉందని వర్షాకాలంలో ఆటో,స్కూటర్లు kuda రోడ్డుపైన తిరగలేని పరిస్థితి అంటున్నారు. అదేవిధంగా నగర శివారులో ఉండడంతో ఎలాంటి భద్రత లేక దొంగతనాలు జరుగుతున్నాయంటున్నారు.ఇళ్ళు కట్టుకోవడానికి ఎవరైనా సిమెంటు, స్టీలు తెచ్చుకుంటే వాటిని కూడా ఎత్తుకుపోతున్నారని చెప్తున్నారు. చాలామంది సాయంత్రం అయితేనే అక్కడ తాగడానికి వస్తారని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని అంటున్నారు. మున్సిపల్, రెవిన్యూ, విద్యుత్ అధికారులు స్పందించి కనీసం రోడ్ పక్కన వెలిసిన ముళ్ళకంపలు తొలగిస్తే బాగుంటుంది అంటున్నారు పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా పాలకులు ఎందరోచ్చిన పేదోడి తలరాత మాత్రం మార్చలేదని వాపోతున్నారు.విద్యుత్తు స్తంభాల అలంకారప్రాయంగా ఉన్నాయని కనీసం ఇళ్ల వద్ద కూడా లైట్లు లేవని చెప్తా ఉన్నారు. కరెంట్ స్తంభాలకు లైట్లు వేసుకోవడానికి లైన్ మెన్ కి మూడు నాలుగు వందలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలనీ కీ పేరు పెట్టి మౌలిక వసతిలు కల్పించి పేదలకు ఇల్లు కట్టుకొనే సౌలభ్యం కోసం చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు. అలాగే పోలీసులు కూడా పీకేటింగ్ నిర్వహించి వారానికి రెండుసార్లు తమ కాలనీ వైపు వసుండాలని చెబుతున్నారు. పేదలను ఆర్థికంగా బలపర్చడమే ద్యేయం అంటున్న పాలక ప్రభుత్వం ఏ మేరకు పేదలకు అండగా నిలుస్తుందో వేచి చూడాలి మరి…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక