ఆంధ్రప్రదేశ్
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నిజాయితీగా విధులు నిర్వహించాలి.
రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్.
మంత్రిని కలిసిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ యాకూబ్ భాష.
రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన యాకూబ్ భాష మర్యాదపూర్వకంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిసారు. గురువారం అమరావతిలోని మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసి అండ్ ఎండి యాకుబ్ భాష మంత్రికి పుష్ప గుచ్చాన్ని అందించి , మైనార్టీల సంక్షేమం కోసం భవిష్యత్తులో తీసుకునే చర్యలపై కార్యాచరణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా మైనార్టీల సంక్షేమం పాతాళానికి చేరిందని అన్నారు. మైనార్టీల సంక్షేమాన్ని తిరిగి గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బృహత్తర ప్రణాళిక దిశగా వివిధ చర్యలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే గతంలో మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి మైనార్టీల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నింటినీ ప్రణాళిక బద్ధంగా అమలు చేసేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇప్పటికే చర్యలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు అండగా నిలిచేందుకు, ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, వ్యాపార పారిశ్రామిక రంగాలలో మైనార్టీలకు భాగస్వామ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని వీసి యాకుబ్ భాషకు మంత్రి సూచించారు. నీతిగా, నిజాయితీగా, నిస్పక్షపాతంగా మైనార్టీల సంక్షేమానికి సేవలందించాలని యాకుబ్ భాషా తో మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక