ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో దస్తగిరి స్వామి జ్ఞాపికల ప్రదర్శన .. – 1000 మంది భక్తులకు అన్నదానం ..

ఏపీ టుడే న్యూస్,కడప జిల్లా, జమ్మలమడుగు ప్రతినిధి, (అక్టోబర్15):
దస్తగిరి స్వామి గార్వి షరీఫ్ పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం పట్టణంలోని జామియా మసీదులో దస్తగిరి స్వామి పవిత్ర జ్ఞాపికలను భక్తులకు సందర్శన నిర్వహించినట్లు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్షా సాదిక్ పాషా ఖాద్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ భక్తితో దస్తగిరి స్వామిని కొలిస్తే ఎలాంటి కోరికలు కోరుకున్నా వారి కోరికలు కచ్చితంగా తీరుతాయని ప్రజల నమ్మకం అని తెలిపారు. అంతేకాకుండా దస్తగిరి స్వామిని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో కొలుస్తారని, ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా దస్తగిరి స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఆయురారోగ్యాలు ప్రసాదించబడతాయని తెలిపారు. అనంతరం దస్తగిరి స్వామి పవిత్ర జ్ఞాపికలకు ప్రత్యేక ఫాతిహా నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులు, తాము జీవిత కాలంలో చేసినతప్పులు మన్నించి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గురువులు సయ్యద్ షా అసద్ పాషా ఖాద్రి, పీఠాధిపతి సోదరులు, కుటుంబీకులు, ముస్లిం సోదర సోదరీమణులు వందలాది సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటోరైటప్:01:ప్రవక్త జ్ఞాపికలకు ప్రత్యేక ఫాతేహా నిర్వహిస్తున్న పీఠాధిపతి,
02: దస్తగిరి స్వామి పండుగలో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక