ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రారంభమైన 68 వ రాష్ట్ర స్థాయి యస్.జి.యఫ్ అండర్ -17 ఫెన్సింగ్ బాల బాలికల క్రీడలు

ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో అక్టోబర్ 20.
తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో క్రీడలకు పెద్ద పీట . నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్.
విద్య శాఖ కమిషనర్ ఉత్తర్వులు మేరకు 68 వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 బాల బాలికల ఫెన్సింగ్ క్రీడలు నంద్యాల పట్టణంలో ని స్థానిక పద్మావతి నగర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియం లో ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరై లాంచనంగా ప్రారంభించారు. నంద్యాల జిల్లా విద్యా శాఖ అధికారి సుధాకర్ రెడ్డి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమము నంద్యాల జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య నిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉర్దూ డి.ఐ హాసముద్దీన్ నంద్యాల యం.ఈ.ఓ బ్రహ్మం నాయక్, మహానంది ఎంఈఓ రామసుబ్బయ్య ,సిరివెళ్ల ఎమ్ఈఓ శంకర్ ప్రసాద్, కోవెలకుంట్ల ఎంఈఓ వెంకట్రామిరెడ్డి, ఉయ్యాలవాడ ఎంఈఓ రఘురామిరెడ్డి, దొర్నిపాడు ఎంఈఓ మనోహర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అనుదీప్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ హాజరయ్యారు. 13 జిల్లాల నుండి సుమారు 350 మంది క్రీడాకారులు 50 మంది క్రీడాధికారులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో క్రీడలను చాలా అభివృద్ధి చేశామని ప్రస్తుతం కూడా నంద్యాల పట్టణంలో కూడా క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, క్రీడాకారులకు వసతులు సమకూరుస్తామని తెలియజేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో క్రీడాకారులకు మంచి గుర్తింపునిస్తామన్నారు . 13 జిల్లాల నుంచి క్రీడాకారులు నంద్యాలకు రావడం చాలా సంతోషంగా ఉందని ఈ రాష్ట్రస్థాయి పోటీలకు నంద్యాల ఆతిథ్యం వహించడం సంతోషం అన్నారు . క్రీడాకారులు అందరూ బాగా ఆడాలన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు . జిల్లా విద్యా శాఖ అధికారి మాట్లాడుతూ క్రీడల విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
అనంతరం నంద్యాల జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఎన్ఎండి ఫిరోజ్ గారిని జిల్లా విద్యాశాఖ అధికారి మరియు వ్యాయామ ఉపాధ్యాయులు డి.యస్.ఏ సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గిడ్డయ్య, ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ రెడ్డి ,నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగేంద్ర, నాగరాజు పి.ఈ.టి మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంఘం కార్యదర్శి రవికుమార్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఫెన్సింగ్ కోచ్ లు మహేష్,లక్ష్మణ్ వ్యాయామ ఉపాధ్యాయులు శివ కుమార్,విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక