ఆంధ్రప్రదేశ్
డ్రైవర్ల సంక్షేమ కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే దశలవారీగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం-సిఐటియు

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 20.
డ్రైవర్ల జీవితాలతో చెలగాటం ఆడే భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ (1)(2) లను రద్దు చేయాలని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ కార్మికుల కుటుంబాల ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే దసరా వారి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్( ఏ ఐ ఆర్ టి డబ్ల్యూ ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ అన్నారు.
రెండో రోజు జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ట్రాన్స్పోర్ట్ కార్మికుల పైన భారాలు ప్రభుత్వాల విధానాల అనే అంశం పైన వివరించడం జరిగింది. అనంతరం ఆటో అండ్ ట్రాలీ, ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ యూనియన్, ఏ ఐ ఆర్ టి డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో డ్రైవర్ల సంక్షేమం కోసం కృషి చేసిన దాఖలాలు లేవని అన్నారు . డ్రైవర్ల సంక్షేమానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం లేదని తెలిపారు. కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బోర్డును ప్రతి రాష్ట్రం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా ఇటీవల జూలై 1 నుండి ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టం 106(1)(2) లను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే డ్రైవర్లు స్టీరింగ్ పట్టుకుంటే జైల్లోకి వెళ్లాల్సిందే అనేవిధంగా చట్టం చేయటం చాలా దుర్మార్గమైనదని అన్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ప్రభుత్వాలు ఏమాత్రం సహాయం చేయకుండా ఎలాగోలా తన శక్తి మేర కుటుంబాన్ని బతికించుకోవడం కోసం డ్రైవర్గా అవతారం ఎత్తితే అక్కడినుంచి డైరెక్ట్ గా జైలుకు వెళ్లే విధంగా చట్టం తీసుకురావడం దుర్మార్గమైన చర్య అన్నారు.రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు . ప్రతి 50 కిలోమీటర్లకు విశ్రాంతి తీసుకోవడం కోసం విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు కనీసం వేతనం అమలయ్యేలా ప్రభుత్వం యజమానులపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు . రాబోయే కాలంలో డ్రైవర్లను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం నిర్వహించి డ్రైవర్ల జీవితాలతో చెలగాడ మాడే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని, గతంలో రైతుల పోరాటం ఏ విధమైన ఉధృతికి దారితీసిందో ఆస్పూర్తితో పోరాటాలు సాగించాలని అన్నారు. రైతు దేశానికి వెన్నెముక అని ఏ విధంగా అంటామో ఖజానా లో ట్రాన్స్పోర్ట్ రంగం ప్రభుత్వానికి వెన్నెముక లాంటిదని ఇటువంటి రంగాన్ని నిర్వీర్యం చేస్తే ప్రభుత్వం పాలన సాగించడం కష్టమవుతుందని తెలిపారు. డ్రైవర్లు అంత ఏకమై ఆందోళనల కు పూనుకుంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుందని, ప్రభుత్వం పునరాలోచించు కోవాలని హెచ్చరించారు. భారత న్యాయ సంహిత చట్టం 106(1),2 లను రద్దు చేసేంతవరకు రాబోయే కాలంలో ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కావున వర్క్ షాప్ లో తీసుకున్న నిర్ణయాల్లో డ్రైవర్లంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ శివాజీ , సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.ఏసురత్నం, ఏ.నాగరాజు, ఆటో వర్కర్స్ యూనియన్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మణ్, లారీ మోటర్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఎల్లయ్య, నాయకులు వీరసేన, ఏ ఐ ఆర్ టి డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర నాయకులు జి శ్రీనివాసరావు, పొలినాయుడు,సురేష్ ,హరిపోతరాజు, ఆటో వర్కర్స్ యూనియన్ కర్నూలు జిల్లా కార్యదర్శి కే ప్రభాకర్, జిల్లా కార్యదర్శి పి వెంకట లింగం పట్టణ నాయకులు జైలాన్ , వీరితోపాటు ఆటో యూనియన్ నాయకులు నరసింహ, జమాల్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక