Connect with us

ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి చెయ్యం ,కానీ అభివృద్ధికి సహకరిస్తాం.

Published

on

ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్ (అక్టోబర్ 20):

సంక్షేమ పథకాలనే పరమావధిగా అభివృద్ధిని ఆగమరచిని వైసీపీ ప్రభుత్వం. యధా రాజా తదాపాలక అన్నట్లు ఆయన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలలో ఎటువంటి అభివృద్ధి చేయలేదనే విషయం అందరికీ తెలిసిందే, అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తీరు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరచింది. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు డబ్బులు పంచడం తద్వారా ఓట్లు అడగడం గతించిన వైసిపి రాజకీయ పార్టీ సిద్ధాంతం.అభివృద్ధి అనేది జరగకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందో, గత ఐదేళ్లలో జరిగిన వైసిపి ప్రభుత్వం ధోరణి దీనికి ఓ ఉదాహరణ. అయితే దానికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వం నేడు అభివృద్ధి వైపున రాష్ట్రాన్ని ముందుకు దూసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడి అనతి కాలంలోనే పంచాయతీలకు నిధులు కేటాయించి గ్రామాల్లో ,పట్టణాల్లో రహదారుల నిర్మాణం చేయాలని ఆదేశించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లకు గాను గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను కూడా వారి స్వలాభం కోసం పథకాల రూపంలో ప్రజలకు పంచి పెట్టడం, తద్వారా గ్రామాలు పట్టణాలు అభివృద్ధి అనేది నోచుకోక దీన స్థితిలో రహదారులు ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చెయ్యని వారు, అభివృద్ధి అవసరం లేదు అన్న వాళ్ళు నేడు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించడంతో రాష్ట్రం మొత్తం కూడా సిసి రోడ్ల నిర్మాణంకు సంబంధించి ఆయా ప్రాంతాలలో కూటమి అభ్యర్థులు తమ ప్రభుత్వ ఘనతగా భావించి భూమి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరగని వింత మంత్రాలయం నియోజకవర్గం లో జరగడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేకపోయినా, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంచాయతీలలో సిసి రోడ్ల నిర్మాణం కు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భూమి పూజలు నిర్వహిస్తున్నడంపై, నియోజకవర్గ ప్రజలు చూసి ఆశ్చర్యపోతున్నారు.పైగా అభివృద్ధికి సహకరిస్తాం అని, అభివృద్ధి చేయలేనివారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. అందులో భాగంగానే మంత్రాలయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎన్ రాఘవేందర్ రెడ్డి నేడు మంత్రాలయం పట్టణంలో సిసి రోడ్లకు భూమి పూజ చేయడానికి ఏర్పాటుచేసిన పల్లె పండుగ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత వైసిపి ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి పట్టుబట్టి మరీ ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు నేను తీసుకొస్తే ,నాకంటే ముందుగానే పల్లె పండుగ కార్యక్రమాలలో పాల్గొని భూమి పూజ నిర్వహిస్తుడంతో అది చూసిన నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇలాంటి వారిని ప్రజలు గమనించాలని, రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేసి చూపెడతానని, కానీ వాటికి పూజ చేయడానికి మాత్రం స్థానిక వైసిపి నాయకులు రెడీగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
సంక్షేమ పథకాలనే పరమావధిగా అభివృద్ధిని ఆగమరచిని వైసీపీ ప్రభుత్వం. యధా రాజా తదాపాలక అన్నట్లు ఆయన ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలలో ఎటువంటి అభివృద్ధి చేయలేదనే విషయం అందరికీ తెలిసిందే, అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తీరు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరచింది. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు డబ్బులు పంచడం తద్వారా ఓట్లు అడగడం గతించిన వైసిపి రాజకీయ పార్టీ సిద్ధాంతం.అభివృద్ధి అనేది జరగకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందో, గత ఐదేళ్లలో జరిగిన వైసిపి ప్రభుత్వం ధోరణి దీనికి ఓ ఉదాహరణ. అయితే దానికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వం నేడు అభివృద్ధి వైపున రాష్ట్రాన్ని ముందుకు దూసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడి అనతి కాలంలోనే పంచాయతీలకు నిధులు కేటాయించి గ్రామాల్లో ,పట్టణాల్లో రహదారుల నిర్మాణం చేయాలని ఆదేశించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లకు గాను గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను కూడా వారి స్వలాభం కోసం పథకాల రూపంలో ప్రజలకు పంచి పెట్టడం, తద్వారా గ్రామాలు పట్టణాలు అభివృద్ధి అనేది నోచుకోక దీన స్థితిలో రహదారులు ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చెయ్యని వారు, అభివృద్ధి అవసరం లేదు అన్న వాళ్ళు నేడు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించడంతో రాష్ట్రం మొత్తం కూడా సిసి రోడ్ల నిర్మాణంకు సంబంధించి ఆయా ప్రాంతాలలో కూటమి అభ్యర్థులు తమ ప్రభుత్వ ఘనతగా భావించి భూమి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో జరగని వింత మంత్రాలయం నియోజకవర్గం లో జరగడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేకపోయినా, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంచాయతీలలో సిసి రోడ్ల నిర్మాణం కు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భూమి పూజలు నిర్వహిస్తున్నడంపై, నియోజకవర్గ ప్రజలు చూసి ఆశ్చర్యపోతున్నారు.పైగా అభివృద్ధికి సహకరిస్తాం అని, అభివృద్ధి చేయలేనివారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. అందులో భాగంగానే మంత్రాలయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎన్ రాఘవేందర్ రెడ్డి నేడు మంత్రాలయం పట్టణంలో సిసి రోడ్లకు భూమి పూజ చేయడానికి ఏర్పాటుచేసిన పల్లె పండుగ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత వైసిపి ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి పట్టుబట్టి మరీ ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు నేను తీసుకొస్తే ,నాకంటే ముందుగానే పల్లె పండుగ కార్యక్రమాలలో పాల్గొని భూమి పూజ నిర్వహిస్తుడంతో అది చూసిన నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇలాంటి వారిని ప్రజలు గమనించాలని, రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేసి చూపెడతానని, కానీ వాటికి పూజ చేయడానికి మాత్రం స్థానిక వైసిపి నాయకులు రెడీగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580263
Total Users : 47947