ఆంధ్రప్రదేశ్
వైసీపీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు

ఏమ్మెల్యే బీవీ సమక్షంలో చేరిన వైసీపీ నాయకులు
ఎమ్మిగనూరు రిపోర్టర్
కూటమి అంటే అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని ఆశించి మంగళవారం వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. చేరిన వారికి సాధారణంగా పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు.ఎమ్మిగనూరు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు సరోజ, వహిద్, స్వాతి, వైసీపీ మరియు సోషల్ మీడియా నాయకులు మన్సుర్ బాషా, జహీర్, వినయ్ లతో మాజీ కౌన్సిలర్ వహబ్ పాటు తదితరులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కౌన్సిలర్లు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. గత ఐదేళ్ల నుండి టిడిపి పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఉన్నారని, వారికి పార్టీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా పార్టీలో మోసం చేయాలని మోసపూరిత డ్రామాలు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు. వైసీపీలో కౌన్సిలర్లు వారి వారి వార్డులో ఒక వైపు కూడా వేసుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం ఒక వ్యక్తికి సహాయం చేసిన పాపనా పోలేదన్నారు. ఆఖరికి స్థానిక సంస్థల నిధులు కూడా మాజీ సీఎం జగన్ గందరగోళ పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి కష్టపడిన నిజాయితీ కార్యకర్తలకు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఏరోజు మర్చిపోడని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అజెండాతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో వార్డుల్లో అభివృద్ధి చేసుకోలేక పోయారని, కౌన్సిలర్లు వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను తాను నెరవేరుస్తానని ఎమ్మెల్యే బీవీ స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారి పార్టీ అభ్యున్నతికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విదంగా పని చేయాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వార్డులో ఎటువంటి అభివృద్ధి చేసుకోలేక పోయారన్నారు. ఈ కార్యక్రమంలో తెదేప నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక