ఆంధ్రప్రదేశ్
నందికొట్కూరు నియోజకవర్గం మండలా, గ్రామాల్లో భూ సర్వే గ్రామ రెవెన్యూ సమస్యల పైన గ్రామ సభల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలి – ఏపీ రైతు సంఘం డిమాండ్

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 23.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బిజి వేముల గ్రామంలో భూ సర్వే గ్రామ రెవెన్యూ సదస్సులో రైతుల పొలాల సమస్యల పైన బుధవారం నాడు గ్రామసభ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో భూ సర్వే డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ గారికి రైతులతో కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో గ్రామ రెవెన్యూ పరిధిలో భూ సర్వే నిర్వహించడం జరిగిందని సర్వే చేయడం వల్ల రైతుల భూములు సరైన పద్ధతిలో లేకుండా పాస్ పుస్తకంలో ఉన్న భూమికి సర్వే చేసిన దానికి తప్పులు రావడం జరిగిందన్నారు. అందువలన తక్షణమే ఈ భూ సర్వేలో తప్పులను సరిదిద్ది రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన రైతుల బాధలు తీరడం లేదన్నారు సర్వే చేసిన గ్రామాల్లో వన్ బీ అడంగల్ రాకపోవడంతో రైతులకు బ్యాంకి రుణాలు రెన్యువల్ చేసే సందర్భంలో ఆన్లైన్లో వన్ బి .రాకపోవడంతో రైతులు రుణము చెల్లించిన తర్వాత వన్ బి తీసుకోవడానికి వెళ్తే ఆన్లైన్లో రాకపోవడంతో బ్యాంకు అధికారులు తిరిగి రుణం ఇవ్వడం లేదన్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఖరీఫ్ రబీ సీజన్లో పంటలు సాగు చేసుకోవడానికి కొత్తగా రైతులు రుణాలు తీసుకోవాలంటే పాస్ పుస్తకం ఉన్న వన్ బి తీసుకురావాలని చెప్పడంతో రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. మండల తహసిల్దార్లు సంతకం పెడితే తప్ప లోను రెనువలు చేయడం గానీ కొత్త లోన్ ఇవ్వడం లేదన్నారు అందువలన సర్వే చేసిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులో రైతులకు ఆన్లైన్లో వన్ బి అడంగల్ వచ్చేటట్టు చేయాలని కోరారు దీనితో పాటు ప్రభుత్వం చుక్కల భూములను రిజిస్టరు చేసుకోవచ్చని క్యాబినెట్లో వెసులుబాటు కల్పించామని చెప్పిన రైతులకు ఎక్కడ కూడా రిజిస్టర్ కావడం లేదన్నారు దీనితోపాటు సర్వే జరిగిన గ్రామాల్లో రైతులు అమ్మాల అన్న కొనుక్కోవలన్న రిజిస్టర్ జరగడం లేదన్నారు. అందువలన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తాసిల్దార్లకు పూర్తి అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల వ్యతిరేకత ప్రభుత్వానికి అర్థమవుతుందని రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎస్ మా భాష, వడ్డే నరసప్ప, గోపాల్, కాజా భాష,మద్దిలేటి, రైతులు షరీఫ్, మల్లయ్య, మధు కృష్ణ, శాంతమ్మ, లక్ష్మీదేవి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక