ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రారంభమైన జిల్లా స్థాయి యస్.జి.యఫ్ కబడ్డీ,బ్యాడ్మింటన్ మీట్ కమ్ సెలక్షన్స్… నంద్యాల జిల్లాను క్రీడల్లో అగ్రగామిగా నిలపాలి ..

ఏపీ టుడే న్యూస్ నంద్యాల జిల్లా టౌన్ రిపోర్టర్ ( అక్టోబర్ 24)
నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్.
నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కే. సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎన్జీవో కాలనీ నందు ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు & నంద్యాల)స్థాయి అండర్- 17/ 14 బాల బాలికల కబడ్డీ మరియు స్థానిక నంది అకాడమీ ఇండోర్ స్టేడియంలో అండర్ 17/14 బాల బాలికల షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి మీట్ కం సెలక్షన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల నుండి దాదాపు 1000 మంది క్రీడాకారులు ఈ సెలక్షన్స్ కు హాజరయ్యారు. ఈ జిల్లా స్థాయి స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మీట్ కమ్ సెలక్షన్స్ ను గౌరవ నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , మరియు రాష్ట్ర ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ భానుమూర్తి రాజు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి, శాంతినికేతన్ స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గౌరవాధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్, రాష్ట్ర అధ్యక్షులు ఏ.పీ రెడ్డి, నంద్యాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలం బాబు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు శంకర్, 19 వ వార్డు పోన్నాపురం కాలనీ ఇంచార్జ్ సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు షేక్ మున్నా, లాయర్ బాబు,మాజీ కౌన్సిలర్ మిద్దె హుసేని హాజరయ్యారు. మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలపతి సభ అధ్యక్షత వహించిన
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ క్రీడాకారులు చక్కటి ప్రతిభ చూపి జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్ర స్థాయిలో నంద్యాల పేరును ఇనుమడింప చేయాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకొన్నారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులు అందరూ కలిసి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ నిర్వహించబడ్డాయి. సెక్రటరి మాట్లాడుతూ సెలక్షన్స్ లో పాల్గొన్న క్రీడాకారులకు కీర్తిశేషులు మాజీ ఎం.పీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, నంద్యాల జిల్లా పిఈటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, రవికుమార్, సెలక్షన్ కమిటీ మెంబర్లు ఖలీల్, సుంకన్న, నాగన్న ,కృష్ణ ,సురేష్ గౌడ్, శివలింగం, భరత్ రెడ్డి, ఓబులేసు, నరసింహ, రామాంజనేయులు, శేఖర్, రసూల్ బి,లక్ష్మీ సరస్వతి మరియు ఉమ్మడి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక