ఆంధ్రప్రదేశ్
పూల వ్యాపారులపై ఎల్ఎంసి స్కూల్ యాజమాన్యం బెదిరింపులు ? .. దుకాణాలు ఖాళీ చేయాలని హుకుం జారీ ?..

ఏపీ టుడే న్యూస్,
కడప జిల్లా,
జమ్మలమడుగు అక్టోబర్ 23,
-టౌన్ చర్చి వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న చర్చి కాంపౌండ్ వాల్
-తాడిపత్రి రోడ్డులో సింగల్ రోడ్డుతో ఇక్కట్లు
జమ్మలమడుగు పట్టణంలోని గాంధీ బొమ్మ సమీపంలో పాత బస్టాండ్ సర్కిల్లో 100 ఏళ్లకు పైగా మున్సిపాలిటీ స్థలంలోని డ్రైనేజీ కాలువలపై చిన్న బంకులు వేసుకొని వ్యాపారం చేసుకుంటున్న పూల ఆంగ్లపై పూల అంగల్ల వెనుక భాగాన ఉన్న ఎల్ఎంసి స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ స్థలంలో దుకాణాలు వేసుకుని మీ అంగళ్లు అడ్డం ఉండడం వల్ల మాకు ఆదాయం రావడం లేదని చెబుతున్నారు. ఈ పూల అంగళ్ళకు, ఎల్ఎంసి స్కూలుకు సంబంధించిన స్థలానికి ఎటువంటి సంబంధం లేదు. 100 ఏళ్లకు పైగా తరతరాల నుంచి జమ్మలమడుగుమున్సిపాలిటీకి పన్నులు కడుతూ రోడ్డుపైన చిన్న బంకులు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై కాలువలపై దుకాణాల తొలగించాలి, ఊరు అభివృద్ధి చేయాలి అంటూ ఎల్ఎంసి స్కూల్ యాజమాన్యం హుకుమ్ జారీ చేస్తున్నారు. మున్సిపాలిటీకి పన్నులు కడుతూ 100 ఏళ్లకు పైగా జీవనం సాగిస్తున్న వారిపై ఎల్ఎంసి స్కూలు యాజమాన్యం వారి బెదిరింపులు ఏమిటని పూల వ్యాపారులు వాబోతున్నారు. పట్టణం అభివృద్ధి చెందాలంటే ప్రజలకు పార్కింగ్ సమస్య తీర్చాలంటే ప్రొద్దుటూరు రోడ్డులోని టౌన్ చర్చ్ ఎదురుగా రోడ్డుకు అడ్డంగా ఉన్న చర్చికి సంబంధించిన కాంపౌండ్ వాల్ తొలగించి మార్పు చేయాలని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ప్రొద్దుటూరు రోడ్డులో నేషనల్ హైవే రోడ్డు కట్టినప్పటికీ టౌన్ చర్చి వద్ద ఇప్పటివరకు చర్చికి సంబంధించిన స్థలంలో ఎంతో లోపలికి చర్చి బిల్డింగ్ ఉన్నా కూడా చర్చి కాంపౌండ్ వాల్ దాటి రోడ్డు ఒక్క అడుగు లోపలికి రాకుండా రోడ్డుకు మధ్యలో కాంపౌండ్ వాల్ ఉన్నా కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ప్రభుత్వ అధికారి కానీ,మున్సిపల్ అధికారులు కానీ రోడ్డుకు అడ్డంగా ఉన్న కాంపౌండ్ వాల్ తొలగించడం లేదు. అలాగే తాడిపత్రి రోడ్డులో బస్టాండ్ కూడలి నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద అలాగే అన్నా క్యాంటీన్ వద్ద మరియు స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ సమీపంలో వాహనాల రాక పోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నదని దుకాణాల ఎదురుగా ప్రజలు, ప్రయాణికులు తమ వాహనాలు నిలిపితే ఆర్టీసీ బస్సులు సైతం ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు.తాడిపత్రిరోడ్డులో కూడలి నుంచి సంజామల మోటు వరకు దాదాపు అన్ని దుకాణాలు రోడ్డు మీదికి రావడంతో సింగల్ రోడ్డు ఉన్నదని ఈ రోడ్డులో ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందిగా ఉన్నదని తాడిపత్రి రోడ్డులో డబల్ రోడ్డు వేయిస్తే తప్ప ప్రయాణికుల ఇక్కట్లు తీరని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటి కైనా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి లు దృష్టి సారించి పట్టణంలోని తాడిపత్రి రోడ్డు మరియు ప్రొద్దుటూరు రోడ్డు నందు రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ సమస్య పరిష్కరించాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.
ఫోటోరేటప్:
01: ప్రొద్దుటూరు రోడ్డులో రోడ్డుకు అడ్డంగా ఉన్న
చర్చి కాంపౌండ్ వాల్
02: తాడిపత్రి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం నుంచి రోడ్డుకు
అడ్డంగా ఇరుకుగా వెళ్తున్న ప్రయాణికులు వాహనాలు
03: స్టేట్ బ్యాంకు వద్ద రోడ్డుపైనే నిలిచిన వాహనాలు
04: మునిసిపల్ రోడ్డుకు మీటర్ దూరంలో ప్లాట్ఫార్మ్ పై
ఏర్పాటు చేసుకున్న పూలంగల్లు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక