ఆంధ్రప్రదేశ్
మన జీవనం ఇతరులకు ఆదర్శప్రాయం కావాలి…కె.శామ్యూల్ పాల్,కర్నూలు జిల్లా విద్యాధికారి

లోపాలను బట్టి మనిషి ఆలోచన స్థాయి దిగజారకూడదు
డాక్టర్ అరుణ్ కుందవరం,హార్ వార్డ్ ఇంటర్ నేషనల్ మెడివర్సిటీ వెల్ నెస్ హోమియో క్లినిక్స్ సిఈఒ,చైర్మన్
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు – నందికొట్కూరు రోడ్డులోని అభయగిరిలో హెచ్ ఐవి సోకిన పిల్లలకు లిటిల్ ఫ్లాక్ ట్రస్ట్ అధినేత జి.బి.ప్రవీణ్ కుమార్,శంబు నీలిమ,హార్ వార్డ్ ఇంటర్ నేషనల్ మెడివర్సిటీ వెల్ నెస్ హోమియో క్లినిక్స్ సిఈఒ,చైర్మన్ డాక్టర్ అరుణ్ కుందవరం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేశారు.కార్యక్రమానికి కర్నూలు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్,అల్ ఫ్రెడ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెల అల్ ఫ్రెడ్ రాజు,మన తెలుగు దినపత్రిక ఎడిటర్ చిన్న రామాంజనేయులు హాజరయ్యారు.ముందుగా పిల్లలకు పౌష్టికాహారం అందచేశారు.అనంతరం ఏర్పాటుచేసిన సభలో జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ మన జీవనం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు.డాక్టర్ అరుణ్ కుందవరం,జి.బి.ప్రవీణ్ కుమార్ లు పిల్లలను దత్తత తీసుకుని,వారికీ జీవనం ఉన్నంత వరకు వైద్య చికిత్సతోపాటు, విద్యాభోధన అందించడం అభినందనీయం అన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. భవిష్యత్ లో తాము సైతం పిల్లల అభివృద్ధికి సహాయసహకారాలు తప్పకుండ అందిస్తానని తెలిపారు.డాక్టర్ అరుణ్ కుందవరం మాట్లాడుతూ ప్రతి మనిషిలో లోపాలను బట్టి తమ ఆలోచన స్థాయిని దిగజార్చుకోకూడదని అన్నారు.క్రమశిక్షణ ద్వారా లోపాలు సరిదిద్దవచ్చు అని అన్నారు.ప్రతిఒక్కరిలో ప్రత్యేక నైపుణ్యం కలిగివుంటారని చెప్పారు.అలాంటి నైపుణ్యత వెలికితీయడం సామజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు.కావున విద్యార్థుల అభివృద్ధికి తమవంతుగా అండగా నిలవడానికి కృషి చేస్తున్నట్లు వారు తెలియచేశారు.మల్లెల అల్ ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ దంపతులు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు జరుపుతున్నట్లు చెప్పారు.నేడు ఇలాంటి కార్యక్రమం రూపొందించడం గర్వకారణం అని అన్నారు.వారితో పాటు డాక్టర్ అరుణ్ కుందవరం సహకారం ఎనలేనిదని చెప్పారు. వారు చేస్తున్న కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లవేళల ఉంటుందని తెలియచేశారు.చిన్న రామాంజనేయులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ తన చిన్ననాటి స్నేహితుడు అని గుర్తుచేశారు. అతని ఆలోచనలు ప్రత్యేక రూపకల్పనా కలిగిఉంటాయని అన్నారు.కావున వాటిని గుర్తించిన డాక్టర్ అరుణ్ కుందవరం సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు జరపాలని కోరారు.ఇప్పటికే వైద్యవృత్తిలో తన సేవలను గుర్తించిన ప్రభుత్వాలు డాక్టర్ అరుణ్ కుందవరంకు అనేక అవార్డులతో గౌరవించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారి సమక్షంలో జరిగే కార్యక్రమాలకు తమ వంతుగా అండగా నిలుస్తామని తెలిపారు.అనంతరం పిల్లలకు హోమియో పతి మందులు అందించారు.అదేవిదంగా కర్నూలు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్,అల్ ఫ్రెడ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెల అల్ ఫ్రెడ్ రాజు,డాక్టర్ అరుణ్ కుందవరంలను శాలువా,పూలమాలతో సత్కరించి, మోమేంటోలు అందచేశారు.ఈ కార్యక్రమంలో సిస్టర్స్ శిల్ప,దీప్తి,లిటిల్ ఫ్లాక్ ట్రస్ట్ టీం సభ్యులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక