ఆంధ్రప్రదేశ్
ఉద్యోగం పేరుతో మహిళకు టోకరా..

ఉద్యోగం పేరుతో మహిళకు టోకరా…
ఫేక్ ఆర్డర్ కాపీలతో మోసం…
లబోదిబో అంటు ఎస్పీని ఆశ్రయించిన మహిళ…
ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో నంద్యాల జిల్లా:
నంద్యాల పట్టణంలోని స్థానిక చాపిరేవుల గ్రామం పక్కన శిల్పానగర్ లో నివసిస్తున్న కుమార్ అమాయక మహిళలను ఎంచుకొని మహిళలకు ఆశా వర్కర్ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళలకు ఆశా చూపించి ఉద్యోగం పేరుతో టోకరా వేస్తున్నాడు. మహిళలకు ఫేక్ ఆర్డర్ కాపీలతో ఉద్యోగం వచ్చిందని మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు.
మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ ఎస్పీని ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణానికి చెందిన సుమలత కు చాప రేవుల గ్రామాన్ని పక్కన శిల్పానగర్ కు చెందిన కుమార్ అనే వ్యక్తి చాప రేవుల అర్బన్ హెల్త్ సెంటర్ వద్దకు దవాఖానకు వెళ్లగా పరిచయం అయ్యాడు. ఆశా వర్కర్లుగా ఉద్యోగం ఇప్పిస్తానని మహిళలు ఆశ చూపించి, నమ్మబలికించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న నాగరాజు అనే వ్యక్తితో కలవాలని అతని ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడికి పంపడం జరిగింది అన్నారు. అక్కడ నాగరాజు అనే వ్యక్తి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అంకిరెడ్డి తో ఆ మహిళను మాట్లాడించగా డాక్టర్ అంకిరెడ్డి ఇప్పటిలో ఉద్యోగాలు లేవు త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం జరిగిందన్నారు. అప్పటినుండి కుమార్ అనే వ్యక్తి మహిళతో ఫోన్లో కాంటాక్టు ఉంటూ ఉద్యోగం ఇప్పిస్తానని మొదటగా 50వేల రూపాయలు తీసుకున్నారని మూడు సంవత్సరాల తర్వాత మీకు ఆర్డర్ కాపీలు రెడీ అవుతున్నాయి మీరు త్వరగా ₹1,80,000 చెల్లిస్తే మీకు ఆర్డర్ కాపీ తెప్పిస్తానని ఫేక్ ఆర్డర్ కాపీ సుమలత సెల్లుకు పంపించి , ఐఏఎస్ అధికారులతో మాట్లాడిస్తానని ఫోన్లలో కాన్ఫరెన్స్ కాల్ తగిలించి ఐఏఎస్ అధికారులంటూ ఇతరులతో మాట్లాడించి 1,80,000 తీసుకొని హుడాయించాడని తెలిపారు. 50,000 రూపాయలు ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతుందని, 1,80,000 రూపాయలు ఇచ్చి 4 నెలలు అవుతున్న ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసం చేశాడని గమనించి నంద్యాల ఎస్పీ కి ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్పీ స్పందించి సంబంధిత అధికారులను ఇచ్చిన అర్జీపై తక్షణమే న్యాయం చేయాలని, మోసపోయిన బాధితురాలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగిందని మహిళ తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక