ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు పై ధ్వజమెత్తిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈరోజు తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కరెంటు చార్జీల భారం ప్రజలపై కరెంటు చార్జీల పిడుగు వేసిన కూటమి ప్రభుత్వం
పై చంద్రబాబు మోసాన్ని ఎండగడుతూ.. ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ డిసెంబరు 27న ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి SE కి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది..కావున ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం లోని ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి అని కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి
* కరెంటు చార్జీలు పెంచబోనని హామీలిచ్చిన చంద్రబాబు
* అవసరమైతే చార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించిన బాబు
* వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు
* అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు
* ఆరు నెలలు తిర్కకుండానే జనంపై చార్జీల పిడుగు.
* అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లేయించుకుని ఇప్పుడు బాదుడే బాదుడు
ఎన్నికలకు ముందు పెంచమన్నారు. ఇప్పుడు నడ్డి విరుస్తున్నారు.
1.ఎన్నికలకు ముందు చంద్రబాబు.. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు హామీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే గతంలో పెంచినవి కూడా తగ్గిస్తామని చెప్పాడు. ఊరూ, వాడా కాలికి బలపం కట్టుకుని ఇదే చెప్పాడు. పులివెందుల, కడప, టీడీపీ మహానాడులోనూ, ఆగస్టు కార్యకర్తలతో జరిగిన టెలికాన్ఫరెన్స్లోనూ, పెద్దాపురంలోనూ, వైజాగ్ విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలోనూ ఇదే చెప్పాడు.
వేర్వేరు చోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ చంద్రబాబు వివిధ సభల్లో ఏమన్నాడో చూడండి.
19 మార్చి 2019, కడప కరెంట్ కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ఐయూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్అస్తున్నాం. ఇళ్లకు 24 గంటలూ ఇస్తున్నాం. భవిష్యత్లో ఎంత కావాలంటే అంత కరెంట్అచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 27 మే 2020, టీడీపీ మహానాడు కరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పాం. ఐదేళ్లు కరెంటు చార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే.. మీరు (జగన్) పవర్రోట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం.
10 ఆగస్ట్ 2022, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్చార్జీలు తగ్గించే వాళ్లం. రాష్ట్రంలో విద్యుత్చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. జగన్అధికారం చేపట్టిన మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్చార్జీలు పెంచారు. విద్యుత్చార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి.
16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం తమ్ముళ్లూ.. ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా? ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడైనా కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెటఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నారు…
2 ఆగస్ట్ 2023, పులివెందుల కరెంట్చార్జీలను పెంచను.. తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్పెంచారు. వినూత్న ఆలోచనతో 2000లో కరెంట్సంస్కరణలు తెచ్చి 2004కు మిగులు విద్యుతెచ్చా. ఎండతో కరెంటు వస్తుంది. సోలార్న్నే తీసుకొచ్చా. రూ.14 ఉండే కరెంటు రూ.2కు వచ్చింది. ఎండతో, గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే రూ.2 నుంచి రూ.3కే కరెంటవస్తుంది. రానున్న ఐదేళ్లలో కరెంట్చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తెస్తా. గ్రిడ్కు కనెక్ట్చసి మిగులు విద్యుత్ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా.
16 ఆగస్ట్ 2023, విజన్ డాక్యుమెంట్ విడుదల విశాఖపట్నం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్చార్జీలు పెంచం. వీలైతే తగ్గిస్తాం. 90వ దశకం చివరిలో విద్యుత్అంగంలో సంస్కరణలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్అగ్రగామిగా ఉంది. సోలార్, విండ్ పంచ్ఎనర్జీ ఉత్పత్తి విధానాలతో యూనిటధర రూ.8 నుంచి రూ.2కు పడిపోయింది. హైడ్రోజన్, అమ్మోనియా హబ్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్చార్జీలను 30 శాతం తగ్గించేందుకు ప్రయత్నిస్తాం.
4 మార్చి 2024 పెనుగొండ ఎవరి మార్కు ఎంత అని అడుగుతున్నాడు.. నేను చెబుతున్నా జగన్.. నీ మార్కు తెలుసుకో. రూ.200 ఉండే కరెంటు బిల్లు రూ.800 చేయడం నీ మార్కు. కరెంటు చార్జీల బాదుడు నీ మార్కు.. ఇలా ఎన్నికల సమయంలో ప్రతి చోటా మైకు పట్టుకుని గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందంటూ బాబు గగ్గోలు ఊరూ వాడా బలపం కట్టుకుని చార్జీలు పెంచబోనంటూ ఊదరగొట్టిన చంద్రబాబు వినియోగదారులే విద్యుత్ ను అమ్మేలా చేస్తానని అబద్దపు మాటలు ఆరు నెలలు తిరక్కుండానే జనం జేబులకు చిల్లులు పడేలా కరెంటు చార్జీల వాత… • ఇందుకోసం వినియోగదారుల చార్జీల పేరుతో పట్టణ స్థానిక సంస్థలు సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం
* ఎప్పటికప్పుడు యూజర్ చార్జీల నిర్వహణ, ఆపరేషన్ వ్యయానికి తగినట్లుగా రుసుము పెంచాల్సి ఉందని చెప్పిన ప్రభుత్వం
* ప్రజలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ బాదేస్తున్న కూటమి ప్రభుత్వం. అని నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు అలాగే వైన్ షాపుల ముందు మందు తాగడం ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేసిన పట్టించుకునే నాధుడే లేదన్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ఎంతలాగా పనిచేస్తున్నారో తెలిసిపోతుంది అన్నారు
ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు కార్పొరేటర్లు లీడర్లు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక