ఆంధ్రప్రదేశ్
ఘనంగా శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం

• జనసంద్రమైన హోళగుంద
• శ్రీ సిద్దేశ్వర స్వామి తేరుకు భారీగా హాజరైన భక్తులు
• విశేషంగా ఉత్సవాలు
• వేలది మందికి అన్నదానం
• విద్యార్థులు ఆలయలో సేవా
హోళగుంద. ఏపీ టుడే న్యూస్
శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. భక్తజన కోటికి ఆరాధ్యుడైన శ్రీ సిద్దేశ్వరుడు తిరువీధుల్లో ఊరేగాడు. కనుల పండువగా సాగిన ఈ రథోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించి తన్మయత్వం పొందా రు, దాంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఓం నమః శివాయ నినాదాలు మారుమోగాయి. పూజల అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల మధ్య తీసుకొచ్చి పూలతో అలకరించిన రథంలో ఉంచారు. శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే గాక, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రథంపై ఉత్సవ విగ్రహాలు ఉంచి తాళ్లతో లాగి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఆలయ పరిశ్రమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమం చేశారు.
ఈ సందర్భంగా భక్తులకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు రాజా పంపన గౌడ్, శివ శంకర్ గౌడ్, సిద్ధార్థ్ గౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హోళగుంద ఎస్ బాల నరసింహులు , పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక