ఆంధ్రప్రదేశ్
శుక్రవారం నుండి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవం…

శుక్రవారం నుండి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవం…
– జయప్రదం చేయాలని ఆర్యవైశ్య సంఘం కమిటీ పిలుపు
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 28:-
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలు ( శుక్రవారం) సాయంత్రం నుండి మార్చి 2వ తేదీ (ఆదివారం) వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు మదనపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పూనగంటి ఓం ప్రకాష్, కోశాధికారి సూరే గిరిధర్ తెలిపారు. శుక్రవారం వాసవీ కన్యకా పరమేశ్వరి అలయంలో ఆర్య వైశ్యా సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్, కోశాదికారి సూర్య గిరిధర్, కార్యదర్శులు దేవత సతీష్, జయం ప్రవీణ్ కుమార్, ఆర్యవైశ్యా యువజన సంఘం అధ్యక్షులు యల్లంపల్లి ప్రశాంత్, డిఎల్పి.గిరి, మువ్వల వెంకటేష్, ఆర్యవైశ్యా మహిళా సంఘం అధ్యక్షురాలు ఒలేటి లక్ష్మి, కోశాది కారి కుసుమ కుమారి తో పాటు ఆర్య వైశ్యా సంఘం, ఆర్యవైశ్యా యువజన సంఘం, ఆర్యవైశ్యా మహిళా సంఘం మరియు అనుబంధ సంఘాలు సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అమ్మవారి మహాకుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి,వైశ్యకుల గురువులు శ్రీశ్రీ రామనాశ్రమ మహాస్వామిజీ, శ్రీశ్రీశ్రీ సమర్థ సద్గురు దర్గామాతాజీ దర్గా స్వామిజీల దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి 28వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గురు ప్రార్ధన, మూలదేవత ప్రార్ధన, గోపూజ, గంగపూజ, మహాగణపతి పూజ, స్వస్తివాచనము, పంచగవ్యము, ఋత్వికరణము, నాందీ మాతృకాపూజ, రక్షాబంధనము, వాస్తు మండలారాధనము, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన పూర్వక మహా గణపతి హోమం, వాస్తు హోమం,రక్షోజ్ఞ హోమం, వాస్తు బలి, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం,1వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు సుప్రభాత సేవ, మహా గణపతి ప్రార్ధన, స్వస్తివాచనం, కళశస్థాపన, వేద పారాయణం, అగ్ని ప్రతిష్టా పూర్వక మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, నక్షత్ర శాంతి హోమం, లఘు పూర్ణాహుతి, మహా మంగళ హారతి,తీర్ధ ప్రసాద వినియోగం సాయంత్రం 6 గంటలకు వేదపారాయణం, మహా గణపతి ప్రార్ధన, స్వస్తివాచనం, కళశారాధన, యంత్రారాధన, మహాసుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం, రుద్ర హోమం, కార్త్యవీర్యార్జున హోమం, ధన్వంతరి హోనుం,పరివార దేవతా హోమం, లఘు పూర్ణాహుతి, అష్టావదాన సేవ, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం, 2వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, వేద పారాయణం,మహా గణపతి ప్రార్ధన, స్వస్తివాచనము, కళశారాధన, ప్రధాన దేవత మూల మంత్ర హోమం, పరివార దేవతా హోమం, అష్టదిక్పాలక హోమం, మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం,మహా మంగళ హారతి, బ్రాహ్మణ ఆశీర్వాదం, తీర్ధ ప్రసాద వినియోగం జరుగునన్నారు. అదేవిధంగా మహా కుంభాభిషేక మహోత్సవం శ్రీకంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల అమృత హస్తములతో 2వ తేది ఆదివారం ఉదయం 9.58 గంటలకు శుభ మేష లగ్నమందు మహా కుంభాభిషేకం శాస్త్రోక్తం నిర్వహించబడునన్నారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా టి.జి. వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు,టి.జి.భరత్,ఏ.పి.రాష్ట్ర పరిశ్రమలు అండ్ వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖమంత్రి,యం.షాజహాన్ బాషా శాసనసభ్యులు,డూండి రాకేష్,చైర్మెన్,ఏ.పి ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పోరేషన్,జి.భానుప్రకాష్ రెడ్డి,తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు ఇతర ప్రముఖులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. కావున పట్టణ ప్రజలు,ఆర్యవైశ్య కులబాంధవులు పెద్దఎత్తున తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి,అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక