Uncategorized
హైకోర్టును తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి

రాజేంద్రప్రసాద్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఏ కుమార్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
హైకోర్టు ను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజేంద్రప్రసాద్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఏ కుమార్ డిమాండ్ చేశాడు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను రాజేంద్రప్రసాద్ బిసి ఎస్సి ఎస్టి ఓసి సంక్షేమ సంఘం లో పనిచేస్తున్నానని నా వద్దకు అనేకమంది సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారని అన్నారు. నా దృష్టికి వచ్చిన సమస్యలను పోలీసుల ద్వారా, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి ప్రస్కారం కోసం పోరాటాలు చేస్తుంటానని అన్నారు. ఇలాంటి క్రమంలోనే బంగారు పేటకు చెందిన దేవపాల అనే వ్యక్తి నాకు తెలిసిన కొంతమంది స్నేహితుల వద్ద డబ్బు తీసుకుని సమస్యలు తీరుస్తానని మోసం చేశారన్నారు. అంతేకాక జయపాల్ అనే వ్యక్తి ఇంకా అనేకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకుగాను అతనిపై 2024 అక్టోబర్ 2 న కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. పోలీసు వారు చర్యలు తీసుకోక పోవడంతో మేము హైకోర్టును ఆశ్రయించి, కోర్టు ద్వారా కేసు రిజిస్ట్రేషన్ కోసం రిట్ వేయడం జరిగిందని అన్నారు. కోర్టు కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు దేవ్పాలపై గతంలోని కేసు ఫైల్ చేశామని కోర్టును తప్పుదోవ పట్టించారు అని తెలిపారు. దేవ పాల్ పై కేసు కట్టామని చెబుతున్న పోలీసులు 2024 సెప్టెంబర్ 12 కోల్స్ కాలేజీ స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్ సృష్టించి అమ్మిన కేసులో ముద్దాయి దేవపాల్ అని చూపిస్తూ మేము అక్టోబర్లో ఇచ్చిన ఫిర్యాదు పై కేసు కట్టామని హైకోర్టును పోలీసులు తప్పుదోవ పట్టించారని అన్నారు. ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 162 – 2024 ను చూసినట్లయితే పోలీసులు హైకోర్టును తప్పుదోవ పట్టించిన అందరికీ అర్థమవుతుందని అన్నారు. అక్టోబర్ లో ఇచ్చిన ఫిర్యాదు పై కేసు కట్టకపోగా సెప్టెంబర్ లో ఎఫ్ ఐ ఆర్ అయినా సంబంధం లేనటువంటి కేసు ను చూపిస్తూ దేవపాలను కాపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పోలీస్ వారు తమ తప్పు తెలుసుకొని దేవ పాల్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక