ఆంధ్రప్రదేశ్
యానాం ప్రజా సమస్యల పై అసెంబ్లీ లో గర్జించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్…

*రీజెన్సీపరిశ్రమను తెరిచేలా సహకరించాలి.
*మున్సిపాలిటీకీ పిసిఆర్ కేడర్ ఆఫీసర్ ను నియమించాలి యానాం పట్టణ సమగ్రాభివృద్ధి పధకాన్ని అమలుచేయాలి.
*ఎస్సీలకు ఇండ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలి పారిశుద్యసమస్య పరిష్కారానికి డంపింగ్ యార్డుకు స్థలాన్ని కేటాయించాలి.
*మున్సిపాలిటీకి పిసిఎస్ స్థాయి అధికారిని నియమించాలి.
*అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్
ఏపీటుడే న్యూస్ పుదుచ్చేరి యానాం (మార్చి 21) యానాంలో మూత పడ్డ వందలాది చిన్నతరహా, మధ్యతరహా, భారీ పరిశ్రమలను తిరిగి తెరిచేవిధంగా తద్వారా పారిశ్రామికాభివృద్ధికి పుదుచ్చేరి ప్రభుత్వం ను ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్అశోక్ కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
వేలాది మందికి ఉపాధిని కల్పించడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా యానాం ఆర్ధికాభివృద్ధికి తోడ్పడ్డ రీజెన్సీ భారీ పరిశ్రమ 13 ఏళ్లుగా మూతపడిందని దానిని తెరిచేవిధంగా సహకరించాలని ఆవిధంగా యాజామాన్యంకు సైతం ప్రోత్సహించాలని కోరారు. గత కొన్ని నెలల క్రితం రీజెన్సీ ఫ్యాక్టరీని తెరిచేలా సంబంధిత యాజమాన్యం చర్యలు తీసుకుంటే వివిధ కారణాలతో పాటు ప్రభుత్వంనుంచి సరియైన స్పందన లేకపోవడంతో మళ్లీ మూసివేశారన్నారు. ఇలాంటి వైఖరితో మనం నిరుద్యోగ యువతకు, కార్మికులకు ఎటువంటి ఉపాధిని కల్పించలేమని ఆవేదన వ్యక్తంచేశారు.
గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేల్యాడ్ నిధులతో చేపట్టిన పనులు పూర్తిచేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సభకు తెలిపారు. మున్సిపాలిటీకి పుదుచ్చేరి సివిల్ సర్వీసెస్ కేడర్ అధికారి నియామకంలో ఆలస్యం జరుగుతుందన్నారు. పిడబ్ల్యుడి శాఖతో ప్రధానరహదారులు, నివాసాల చెంత డ్రెయినేజీల నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు. సాగు, తాగునీటి సమస్య తీసుకోవాల్సిన చర్యలు, ఎల్ఎడి శాఖకు సంబంధించిన వివిధ పనులు, సమస్యలను ఆయన ప్రస్తావించారు.
*సమగ్రాభివృద్ధి పథకాన్ని అమలుచేయాలి…*
మాస్టర్ ప్లాన్ అమలుకు చాలా సమయం తీసుకుంటుంన్నందున పలువురు పెట్టుకున్న ల్యాండ్ కన్వర్జేషన్ దరఖాస్తులను ఆమోదించాలని కోరారు. కనీసం సమగ్రాభివృద్ధి పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఇ-గవర్నెన్స్ ద్వారా ఏదైనా ల్యాండ్ తదితరవాటికి సంబంధించి అనుమతులు ఇవ్వాలని కోరారు. జిప్లస్4 నిర్మాణ భవనాలకు బిల్డింగ్ ఓనర్స్ ఇచ్చే టౌన్ ప్లా నింగ్ ఆధారిటీ, పుదుచ్చేరివారి మాత్రమే అనుమతివ్వాల్సివుండటంతో నిర్మాణాలు చేపట్టడానికి 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని సభ దృష్టికి తీసుకువచ్చారు.
వివిధశాఖల్లో మూడు సంవత్సరాలు పూర్తయిన అధికారుల బదిలీకి సంబంధించి గూర్చి వివరించారు. కోట్లాది రూపాయిలు యానాం కోపరేటివ్ సొసైటీ ద్వారా పక్కదోవ పట్టాయని రూ.75 లక్షలు సొమ్ము ప్రవీణ్ అనే వ్యక్తి కాజేసాడని విచారణ నివేదిక ఇచ్చారని కాని అతనిపై యానాం పోలీసులు కేసు నమోదు చేయాలేదని సమస్యపై ఇప్పటివరకు చర్యలు లేవన్నారు. పక్కదోవపట్టిన నిధులను రాబట్టాలని కోరారు.
ఇటీవలి తుఫానుకు నష్టపరిహారం ఇచ్చినందుకు సిఎం రంగసామికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యశాఖకు సంబంధించి అక్షయపాత్రను మధ్యాహ్ననభోజన పధకం ద్వారా అమలు చేయాలని కోరారు. పిడబ్ల్యుడి, మున్సిపాలీటీ తదితరశాఖలకు సంబంధించిన అధికారులు కొంతమంది రాజకీయనాయకుల చెప్పుచేతల్లో వారికి మద్దతుగా ఉంటూ ప్రజాభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో పారిశుద్య పనులకు సంబంధించి శాశ్వతప్రాతిపదికన డంపింగ్ యార్డ్ కు స్థలాన్ని కేటాయించాలని కోరారు. స్థలం కేటాయించకుండా, పారిశుధ్యపనులు చేయకుండా కొంతమంది అడ్డుకుంటున్నారన్నారని దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఎస్సీలకు ఇండ్ల స్థలపట్టాలును ఇచ్చేలా ఆదిద్రావిడశాఖ ద్వారా స్థలాన్ని సేకరించాలని కోరారు. రూ.35వేలతో గత కొన్నేళ్లు క్రితం నిర్మాణం చేసి శిధిలస్ధితిలో ఉన్న ఇండ్ల స్థానంలో నూతనగృహాలు నిర్మాణంకు చర్యలు తీసుకోవలని, ఎస్సీ విద్యార్ధుల స్కాలర్షిప్లు, విద్యారుణాలు నిలిచిపోయాయని తక్షణం వాటికి పరిష్కారం చూపాలని కోరారు. టూరిజమ్ శాఖ కు సంబంధించి ఫెర్రీని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ బడ్జెట్లోనైనా ఫెర్రీ ప్రాంత పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కోరారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక