ఆంధ్రప్రదేశ్
పోలీసుల అదుపులో రేషన్ బియ్యం లారీ…?
పోలీసుల అదుపులో రేషన్ బియ్యం లారీ…?
- – రేషన్ బియ్యం కు పాలిష్ చేసి ఇతర ప్రాంతాలకు
- – ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన బియ్యం అంటూ బుకాయింపు
కడప …
ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు ఓ రేషన్ బియ్యం లారీని పట్టుకుని స్టేషన్ వద్ద ఉంచారు. గురువారం తెల్లవారు జామున , లేక అర్ధరాత్రి ఇలా లారీ జమ్మలమడుగు నుంచి మైదుకూరు వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు… రేషన్ బియ్యం ను పాలిష్ చేసి కొందరు అక్రమార్కులు రాష్ట్రాలు దాటిస్తున్నారు. పట్టుకున్న లారీ కి సంబంధించి తమ వద్ద ప్రభుత్వం వద్ద రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు రికార్డులు ఉన్నాయన్న విషయం సదరు లారీ యజమాని చెప్పినట్లు తెలుస్తోంది… అయితే చాలా ప్రాంతాల్లో ఇలాగే రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న సమయంలో ఎప్పుడో ప్రభుత్వం వద్ద రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు ఉన్న బిల్లులను చూపి యదేచ్ఛగా రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న విషయం చాలా సందర్భాల్లో బహిర్గతమైంది… మైదుకూరు ప్రాంతంలో అయితే ఇలా జరగడం చాలా సందర్భాల్లో చూశాం… ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్ల వద్దనే కిలో 17 రూపాయలకు కొనుగోలు చేసి వాటికి పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు కిలో 25 రూపాయలకు పైగా విక్రయిస్తున్నట్లు చాలా సందర్భాల్లో పట్టుబడిన నిందితులు చెప్పారు… ప్రస్తుతం పట్టుకున్న రేషన్ బియ్యం విషయంలో కూడా అధికారులు అన్ని రికార్డులు పరిశీలించాల్సిన అవసరం ఉంది… మరి అధికారులు ఎలా లెక్కలు వేస్తారో వేచి చూడాల్సిందే…
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక