ఆంధ్రప్రదేశ్
వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు
పట్టణంలో వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా కదం తొక్కిన ముస్లింలు, వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణ రద్దు చేయాలని ముస్లిం ఆస్తులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. భాజపా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు పట్టణ, గ్రామీణ ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ప్రొద్దుటూరు పట్టణం మట్టి మజీద్ వీధి నుండి పుట్టపర్తి సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం శివాలయం సెంటర్ కి చేరుకొని బహిరంగ సభ నిర్వహించారు. ర్యాలీలో హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. వక్ఫ్ పరిరక్షణకు ముస్లింలు ఐక్యం కావాలి అంటూ ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ గత దశాబ్ద కాలం నుండి ముస్లింలపై బిజెపి అరాచకాలు ఎక్కువైనాయని అన్నారు. ముస్లింలు తినే తిండి పై, కట్టుకునే దుస్తులు, నడిచే నడకపై ఆంక్షలు పెట్టే విధంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. ముస్లిం శాంతి ర్యాలీకి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్, పలు ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు ఇచ్చి ర్యాలీ లో పాల్గొన్నారు. తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక