ఆంధ్రప్రదేశ్
తిరుపతి జిల్లా కలెక్టర్ తో ఎంపీ గురుమూర్తి భేటీ
*ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో సమస్యలు పరిష్కరించండి*
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉన్న ప్రజల జీవన విధానం దుర్భరంగా మారిందని, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు సంబందించిన వాకాడు, చిట్టమూరు, తడ మండలాలు ఈ జోన్ పరిధిలో ఉన్నాయని గత మూడు సంవత్సరాలుగా వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో శాశ్వత రహదారులు నిర్మించలేనందున వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా పాడైపోయి ప్రయాణం సాగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అత్యవసర సమయాలలో కనీసం అంబులెన్సు కూడా ప్రయాణం సాగించలేని పరిస్థితులు ఉన్నాయని కలెక్టర్ కి వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్, చైర్మన్ గా ఒక కమిటీ నియమింపబడిందని మునుపటి కలెక్టర్ లక్ష్మి షా ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతంలో పర్యటించి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కానీ తదుపరి ఏర్పడిన పరిస్థితులలో ఆయన మారిపోవడంతో సమస్యలు పరిష్కరింపబడలేదని కావున వీలైనంత త్వరగా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. సావధానంగా విన్న కలెక్టర్ త్వరలోనే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరిస్తామని తెలియజేసారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87459