ఆంధ్రప్రదేశ్
కడియంలో ఆకట్టుకున్న వరల్డ్ ఫొటోగ్రఫీ వర్క్ షాప్

ఫొటోగ్రాఫిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ , రాజమహేంద్రవరం ఫోటో ఆర్ట్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యాన తూర్పుగోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీలో సోమవారం వరల్డ్ ఫొటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించారు.నర్సరీ రైతులు పల్ల వీర వెంకట సత్యనారాయణ మూర్తి, సుబ్రహమణ్యం, గణపతి, వెంకటేష్, వినయకుమార్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పోర్టియేట్ టెక్నీక్స్, కాంపోజిషన్, ఎక్స్ పెరిమెంటల్ ఫొటోగ్రఫీ, మోడల్ షూట్ అంశాలపై సాగిన ఈ వర్క్ షాపులో ఫోటోగ్రఫీలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఫొటోగ్రాఫిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రా అధ్యక్షుడు ముసిని వెంకటేశ్వరరావు(బాబులు), సెక్రటరీ జి రామకృష్ణంరాజు,ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడెమీ కార్యదర్శి కె సుధాకర రెడ్డి, ఫోటో ఆర్ట్ క్లబ్ కార్యదర్శి టి వీరభద్రరావు, కడియం ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ యూనియన్ అధ్యక్షుడు బి మల్లికార్జున రెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎం లక్ష్మీనారాయణ చౌదరి, కె సుబ్రహ్మణ్యం , రాష్ట్ర నలుమూలల నుంచి 59మంది ప్రముఖ ఫోటోగ్రాఫర్లు ఆధునిక కెమెరాలతో హాజరయ్యారు. పలువురు మోడల్స్ ఫొటోలను నర్సరీ అందాలు మధ్య తమతమ శైలిలో క్లిక్ చేసారు.ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక