ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎమ్మెల్యే బండారు ఆదేశం

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
మండలంలో పెండింగ్లో ఉన్న నాడు – నేడు,జల్జీవన్ మిషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు సూచించారు. మంగళవారం ఆలమూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిధుల కొరతతో ఆగిపోయిన భవన నిర్మాణాలతో పాటుగా ప్రతి పనిని పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జొన్నాడ- మండపేట ప్రధాన రహదారి పై ఏర్పడిన ప్రమాదకరమైన గుంతల్ని వెంటనే పూడ్చి తాత్కాలిక మరమ్మత్తులతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని ఆర్ అండ్ బి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కడియం వెదురుమూడి రహదారి నిర్మాణం గురించి సైతం ప్రణాళికలు రూపొందించాలన్నారు. అధికారులు గ్రామ సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. వర్షాల వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది గనుక పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు శ్రద్ధ వహించాలని తెలిపారు. వ్యాధుల నియంత్రణలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను పంచాయితీ అధికారులతో కలిసి వైద్యారోగ్య శాఖ సైతం గ్రామాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు. ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించిన తరువాత తొలిసారిగా మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన శాసనసభ్యులు బండారు సత్యానందరావును మండల ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. శాసనసభ్యునిగా 57 గ్రామాల్లో ఏ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం జరిగినా తనకు సంతోషమేనని అందుకు తగిన సహకారం, తోడ్పాటు అందిస్తానని స్థానిక ప్రజాప్రతినిధులకు బండారు సత్యానందరావు భరోసా అందించారు. అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లి ప్రజా సంక్షేమం కోసం, సమాజాభివృద్ధి కోసం పాటుపడదామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు,జడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి, ఎంపీడీవో, తాసిల్దార్ వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక