Uncategorized
ఇది ఎన్నడూ ఏ చరిత్ర ఇవ్వని వీడుకోలు

– అవినీతి సర్కార్ పని అయ్ పాయ్
– ఇది రక్తరహిత నిశ్శబ్ద తిరుగుబాటు
– ప్రతి ప్రజానాయకుడికి హెచ్చరిక
ఎన్నికల్లో మ్యాండీడెట్ నంబర్ వచ్చింది.ఇక మాదే రాజ్యం…మేమే రాజులం అంటూ విర్రవీగే గి ప్రవర్తిస్తే కర్రుకాల్చి వాత పెట్టి అధః పాతాళానికి ప్రజలు తొక్కేసే ప్రజా రాజ్యమిది అని రాజకీయ నాయకులు పాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితిని 2019,2024 ఎన్నికలు సుస్పష్టంగా ప్రకటించాయి.రక్తపాతమెరుగని నిశ్శబ్ద తిరుగుబాటు మనకు చరిత్ర లో కనిపించదు. అయితే ఐదేళ్ళ పాటు వైఎస్సార్ సీపీ రాజ్యహింసను భరించి తమ నిర్ణయాన్ని నిశ్శబ్దంగా,ప్రశాంతంగా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేసి ఒక్కసారిగా అద్దః పాతాళానికి తొక్కిన సజీవచరిత్ర ఇది.ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించతగిన సుదినం ఇది. రాయలసీమ నాది…కడప జిల్లా నా అడ్డా అంటూ విర్రవీగిన వైఎస్సార్ కుటుంబానికి ఇక సెలవు అంటూ వీడ్కోలు చెప్పిన 2024 జూన్ 4 ప్రజలకు మరో వందేళ్లు గుర్తుండేలా చెప్పిన రోజు ఇది.ఒకరకంగా ఇది కూటమి గెలుపు అనేకంటే భస్మాసురుడు లాగా తయారై జగన్ మోహన్ రెడ్డి తన చరిత్రను తానే భస్మం చేసుకున్నాడు అనడం సబబు. ఐదేళ్ళ క్రితం 151 సీట్లతో భారీ విజయం సాధించిన జగన్ కేవలం ఐదేళ్ళ తరువాత పది సీట్లతో ఇంత దారుణ పరాజయం చెందడం అంటే భస్మాసుర హస్తం కాక మరేమిటి…? ప్రజాపాలనను రాచరిక పాలన గా చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన స్థితి పడుతుంది. ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డికే గుణపాఠం కాదు ప్రజాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, ఆదరించిన ప్రజలను వేదనకు గురి చేస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి దాపురిస్తుంది అని ప్రజలిస్తున్న హెచ్చరిక. కడప ఆంటేనే వైయస్ కుటుంబం అంటూ దశాబ్దాలుగా మెయింటైన్ చేసిన వైఎస్ఆర్ కుటుంబానికి ఇది తీవ్రమైన దెబ్బ. కడప జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా కేవలం ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసిన పులివెందుల, ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేలు నియోజకవర్గాలు మాత్రమే వైయస్సార్ పార్టీకి విజయం సాధించగా మిగతా ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించింది.మరీ ముఖ్యంగా కడప కేంద్రంలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువ.అక్కడ ముస్లిం కాండిడేట్ అయితే మరో వర్గం హిందూ క్యాండిడేట్ నిలబెడితే గెలిచే ప్రసక్తే లేదు. అలాంటి చోట కడప నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్. మాధవి రెడ్డి 18,860 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సిపి తరపు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఓటమిపాలయ్యారు. కమలాపురం నియోజకవర్గం అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. అయినా అక్కడి ఓటర్లు వైఎస్ఆర్సిపి అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉత్త కృష్ణ చైతన్య రెడ్డి 25,357 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.మైదుకూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్ ను ఓడించిన రఘురామిరెడ్డిపై ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,950 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దీనబంధుగా ప్రచారం చేసుకున్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై ప్రొద్దుటూరు పెద్దాయనగా పేరుగాంచిన నంద్యాల వరదరాజుల రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున 22 వేల 744 ఓట్లతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 61,687 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో ఆయనకు 90 వేలకు పైగా ఆయనకు మెజార్టీ వచ్చింది. ఈసారి మెజార్టీ 30 వేలకు పైగా తగ్గిపోవడం గమనార్హం. జమ్మలమడుగు నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై మాజీ మంత్రి, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి 17,191 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫునుంచి డాక్టర్ సుధా పోటీ చేశారు. ఆమె ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి బొజ్జ రోషన్న పై 18,567 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓడిపోతున్న అభ్యర్థులు తమ ఓటమిని అంగీకరిస్తూ కౌంటింగ్ మధ్యలోనే కౌంటింగ్ కేంద్రాల నుంచి ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్లిపోయారు. ఓడిన వాడు అందరి ముందు ఏడుస్తాడు… గెలిచినవాడు తాను పెట్టిన ఖర్చు తలుచుకుంటూ ఇంట్లో కూర్చుని ఏడుస్తాడు అని ఒక సామెత ఉంది. కానీ కడప జిల్లా వైసీపీ నాయకులు కౌంటింగ్ మధ్యలోనే ఏడవడం మొదలుపెట్టారు పాపం. ఈ ఎన్నికలతో వైఎస్ఆర్ కుటుంబ ప్రతిష్ట మసకబారిందని చెప్పవచ్చు. కడప జిల్లా పై ఆధిపత్యం చేస్తున్న పులివెందుల ప్రాంతానికి రానున్న రోజుల్లో ప్రాభవం పూర్తిగా దిగజారే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి పై ఉన్న కేసులు, అవినాష్ రెడ్డి పై ఉన్న కేసులు,దరిమిలా ఆ ప్రాంతంలో తమ ప్రాశస్త్యాన్ని నిలుపుకునేందుకు సరైన నాయకులు లేకపోవడంతో పులివెందుల గడ్డ కడప జిల్లా పై… తద్వారా రాయలసీమ పై ప్రాభవం నిలుపుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక