ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పేదల అక్రమించిన భూములను లబ్ధిదారులైన పేదలకే పంచాలి.సిపిఐ. బడా భూస్వాముల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.సిపిఐ.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భూ బాధితుల సదస్సు విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. సిహెచ్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 26వ జిల్లా ల నుండి భూ బాధితులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు .ఈ సదస్సుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాలా నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శులు పాల్గొనడం జరిగింది.
ఈ సదస్సులో నంద్యాల జిల్లా లో పేదల ఆక్రమించిన భూములను వివరాలు. పెత్తందారులు బడా భూస్వాములు ఆక్రమించిన భూముల వివరాలతో కూడిన వినతి పత్రాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గారికి. సిపిఎ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు గారికి అందజేయడం జరిగింది.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే రామాంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి. ఎన్ రంగనాయుడు.సిపిఐ జిల్లా సహా య కార్యదర్శిఎస్. బాబా ఫక్రుద్దీన్. డోన్. కార్యదర్శి. నారాయణ ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన్న. ఆత్మకూరు కార్యదర్శి టి ప్రతాప్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ షమీం బేగం, సిపిఐ సీనియర్ నాయకులు సంజీవులు, పాములపాడు నాయకులు ఏసోబు, మల్లికార్జున, డోన్ మండల నాయకులు కుమార్, మనోహర్ ఇతరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు మాట్లాడుతూ
డోన్ పట్టణంలోని రుద్రాక్ష గుట్టలో పేదలకు ఇంటి స్థలలకై సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటాలు నిర్వహించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలకు విన్నవించిదశాబ్దాలు గడుస్తున్న చలనం లేదని గత ప్రభుత్వ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీకు ఇంటి స్థలాలు పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కారణంగా డోన్ ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు . నందికొట్కూరు తాలూకా పాములపాడు మండలంలోని భానుకచెర్ల గ్రామంలో 30 సంవత్సరాలుగా 200 మంది లబ్ధిదారులు పూరి గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుంటే గత ప్రభుత్వంలో భూములకు ఏ మాత్రం సంబంధం లేని హైదరాబాదులో ఉన్న వ్యక్తి ఆ భూమిని అవినీతి అధికారులతో చేతులు కలిపి తన పేరు మీద ఆన్లైన్ చేపించుకోవడం దుర్మార్గమని అన్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణం.పద్మావతి నగర్ దగ్గరే ఉన్నా సర్వేనెంబర్ 703 కాలువ పురంబోకు భూములో పేదలు గుడిసెలు వేసుకున్నారని వాటికి ఇంటి పట్టాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలకు విన్నవించిన చెవుటోడి ముందర శంఖం ఊదినట్లు ఉందని అన్నారు. పాణ్యం మాజీ శాసనసభ్యులు రాంభూపాల్ రెడ్డి గ్రీన్కో సంస్థతో కుమ్ముకై లబ్ధిదారుల డబ్బులను సొంతంగా వాడుకుని వారికి ఇవ్వకపోగా అతని అనుచరులు ఆక్రమించినప్రభుత్వభూములను ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోలేకపోవడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు.
సిపి ఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ గారి నేతృతంలో పై భూముల వివరాలను తీసుకుని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ కు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ద్వారా ఉద్యమాలు ఉధృతం చేస్తామని పై నాయకులు తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక