Connect with us

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కన్వీనర్ గా ఏకగ్రీవ ఎన్నిక

Published

on

విజయవాడ :—

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యాలయం నందు శుక్రవారం నాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎస్. సిద్ధార్థ, టి.విష్ణువర్ధన్, జి. శేఖర్ బాబు, కె. వెంకట వేణు, క్రిష్ణ భగవాన్ సమక్షంలో ఏపిజెయు నంద్యాల జిల్లా కన్వీనర్ గా నందవరం శ్రీనివాసులు ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ వెంకట వేణు, రాష్ట్ర సహాయ కార్యదర్శి క్రిష్ణ భగవాన్ లు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ అనేది కేవలం పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టుల హక్కుల కోసం సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నదని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావలసిన సంక్షేమ పొలాల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలలో ఏపీజేయు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలోని నంద్యాల జిల్లాలో ఏపీజేయు జిల్లా కమిటీ ఎన్నిక కోసం నంద్యాల జిల్లాకు చెందిన నందవరం శ్రీనివాసులు ను జిల్లా కన్వీనర్ గా ఏకగ్రీవంగా విజయవాడ నగరంలోని ఏపీజీవీ రాష్ట్ర కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలోని పాత్రికేయులందరినీ సమిష్టిగా కలుపుకొని ఏపీజేయు యూనియన్ అభివృద్ధికి , పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, నిబద్ధత నిష్పక్షపాతంగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలోని జర్నలిస్టుల నుండీ ఏపిజెయు యూనియన్ సభ్యత్వాలను ఆన్లైన్ పద్ధతి ద్వారా మాత్రమే చేయించాలని తెలిపారు.అనంతరం ఏపీజేయు నంద్యాల జిల్లా కన్వీనర్ నందవరం శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీజేయు రాష్ట్ర కమిటీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని కొమ్ము చేయకుండా నంద్యాల జిల్లాలోని జర్నలిస్టులందరినీ సమిష్టిగా కలుపుకొని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం హక్కుల కోసం సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ నా వంతుగా ఏపీజేయు యూనియన్ అభివృద్ధి కోసం అంకితభావంతో, నిష్పక్షపాతంగా పనిచేస్తానని అన్నారు. అదేవిధంగా ఏపీజేయు రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం, నియమ నిబంధన ప్రకారం ఏ విధమైన అవినీతి కార్యక్రమాలు పాల్పడకుండా ,నిస్వార్ధంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజేయు నంద్యాల జిల్లా నాయకులు ఎస్ డి ఛానల్ మరియ దాస్ , పాణ్యo సుబ్బయ్య, ఎన్. సుబ్బలక్ష్మయ్య. మధు యాదవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580187
Total Users : 47871