ఆంధ్రప్రదేశ్
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు కేంద్రం ఆమోదించడం శుభ పరిణామం పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి

ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ
ఈ సందర్భంగా గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ
20 24 ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు
అంతేకాకుండా పారిశ్రామికంగా కూడా స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని అడుగులు ముందుకు వేయడం జరిగింది దీనికి ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వల్ల మనకి ఇవి సాధ్యమైనవి గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పారిశ్రామిక స్మార్ట్ సిటీగా రూపుదిద్దడానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఓర్వకల్లు ను ఇండస్ట్రియల్ హబ్ గా చేసి ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది కర్నూలు కి 20 కిలోమీటర్ల దూరంలోనే ఓర్వకల్లు ఉండి ఇక్కడ దాదాపు వ్యవసాయానికి ఆమోదయ యోగ్యం కానీ 33 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించడం జరిగింది
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో సోలార్ పవర్ పార్క్ అయితే నేమి ఎయిర్పోర్ట్ ,జయరాజు ఉక్కు పరిశ్రమ,డి ఆర్ డి ఓ,ఇలా ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది
గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సేపు ఉన్న ఈ పరిశ్రమలకు అడుగులు ముందుకు వెయ్యలేదు ఎంతసేపు ఉన్న వాళ్ళు బాగుపడడము కార్యకర్తలు బాగుపడడం ఎక్కడ స్థలాలు దొరుకుతాయా ఎక్కడ కబ్జాలు చేద్దామా అన్న ఆలోచన తప్పనిస్తే, వాళ్లు గత ప్రభుత్వంలో చేసింది ఏందయ్యా అంటే వచ్చిన శిలాఫలకాలను పగలగొట్టడం అంతేకాకుండా ధ్వంసం చేయడం ఏదైతే గతంలో ఏర్పోర్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసి ఇనాగరేషన్ చేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని ఇనాగ్రాట్ చేయడం తప్పనిస్తే వాళ్ళు చేసింది ఏమీ లేదు
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పారిశ్రామికంగా మన రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది,ముఖ్యంగా పాణ్యo నియోజకవర్గo లొనీ ఓర్వకల్లు నీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు
జూలైలో 23వ తేదీనా కేంద్ర బడ్జెట్ విడుదల చేయడం జరిగింది దాంట్లో ఆ రోజే మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్ గా ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. చెప్పిన 50 రోజుల్లో పై కూటమి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించడం అంటే కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ది ఉందో అర్థం చేసుకోవచ్చు
మొత్తం 12 ఇండస్ట్రీస్ కేంద్రం ప్రకటిస్తే దాంట్లో మన ఏపీకి 2 రావడం చాలా సంతోషదాయకం అందులో ఒకటి కడప జిల్లాలోని కొప్పర్తిలో అలాగే ఇంకొకటి మన కర్నూలు జిల్లాలోనిలో ఓర్వకల్లులో ఏర్పాటు చేయడం చాలా అర్హర్షించదగ్గ విషయము దీని ద్వారా ఇక్కడ ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు ఇలా చాలా అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి కాబట్టి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పనులు పూర్తి చేస్తాం అని గౌరు చరిత రెడ్డి తెలిపారు
ముఖ్యంగా నేనొక్కటే తెలియజేస్తున్న ఆరోజు చెప్పిన మాట ప్రకారమే మనకి ఈరోజు మన ఓర్వకల్లులో 2600 ఎకరాలను 2800కోట్లతో ఈరోజు బడ్జెట్ కూడా విడుదల చేసినందుకు నేను ప్రధాన మంత్రి గారి కి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి గారి నిర్మల సీతారామన్ గారికి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా
ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగానే 45 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది అంతేకాకుండా పరోక్షంగా కూడా లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మన ప్రాంతమంతా ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తుందని కూడా మీకందరికీ తెలియజేసుకుంటున్నా
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చింత సురేష్ గారు, బిజెపి నాయకులు గంగాధర్ గారు,నంద్యాల మహిళా అధ్యక్షురాలు కే పార్వతమ్మ గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి గారు,కల్లూరు మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు గారు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక