Connect with us

ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పేదలు నివాస స్థలాలుగా ఏర్పరచుకున్న ప్రభుత్వ భూములకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి.సిపిఐ.

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

జిల్లాలో ప్రభుత్వ భూములలో నిరు పేదలు నివాస స్థలాలగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ భూములకు ఇళ్ల పట్టాలి ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయకులు ప్రభుత్వ భూములను అక్రమ పద్ధతిలో ఆక్రమించిన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకుని అర్లే నేను నిరుపేదలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గార్ల నాయకత్వంలో జిల్లాలో పేదలు నివాస స్థలాలుగా ఉన్న భూముల వివరాలు వైసిపి నీ నాయకులు ఆక్రమించి ప్రజలకు లబ్ధిదారులకు ఇబ్బంది కలిగిస్తున్న భూముల వివరాలను రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే రామాంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి. ఎన్ రంగనాయుడు.సిపిఐ జిల్లా సహా య కార్యదర్శిఎస్. బాబా ఫక్రుద్దీన్. పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు మాట్లాడుతూ
డోన్ పట్టణంలోని రుద్రాక్ష గుట్టలో పేదలకు ఇంటి స్థలలకై సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటాలు నిర్వహించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలకు విన్నవించిదశాబ్దాలు గడుస్తున్న చలనం లేదని, గత ప్రభుత్వ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీకు ఇంటి స్థలాలు పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మోసం చేసినాడని తెలిపారు. టిడిపి ప్రభుత్వం డోన్ పట్టణంలోని రుద్రాక్ష గుట్టలో గృహాలు ఏర్పాటు చేసుకుని నష్టపోయిన ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పేరంటాలమ్మ గుడి దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలు నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుని జీవన కొనసాగిస్తున్న ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. నందికొట్కూరు తాలూకా పాములపాడు మండలంలోని భానుకచెర్ల గ్రామంలో 30 సంవత్సరాలుగా 200 మంది లబ్ధిదారులు పూరి గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుంటే గత ప్రభుత్వంలో భూములకు ఏ మాత్రం సంబంధం లేని హైదరాబాదులో ఉన్న వ్యక్తి ఆ భూమిని అవినీతి అధికారులతో చేతులు కలిపి తన పేరు మీద ఆన్లైన్ చేపించుకోవడం దుర్మార్గమని తెలిపారు . రెవెన్యూ అధికారులు పేదలు నివాసం ఏర్పాటు చేసుకున్న గుర్తులు పరిశీలించి వారికి ఇండ్లపట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని అదేవిధంగా నంద్యాల పట్టణం.పద్మావతి నగర్ దగ్గరే ఉన్నా సర్వేనెంబర్ 703 కాలువ పురంబోకు భూములో పేదలు గుడిసెలు వేసుకున్నారని వాటికి ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం మండలంలోని వడ్డే సుబ్బరాయుడు భూమిని వైసిపి నాయకుడు భూమిని ఆక్రమించుకొని అధికారులతో కుమ్ముక్కై తన పేరు మీద ఆన్లైన్ చేపించుకొని వడ్డే సుబ్బరాయుడు కుటుంబానికి ఎస్సీ కేసులు పెడతామని భయబ్రాంతులకు గురి చేస్తున్న పట్టించుకోని పోలీసు రెవెన్యూ అధికారులపై చర్యలు చేపట్టి బాధితునికి న్యాయం చేయాలని అన్నారు. బనగానపల్లె పట్టణంలోని ఎస్ఆర్బిసి ప్రభుత్వ భూములలోలబ్ధిదారులుగుడిసెలు వేసుకుని నివాస స్థలాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తుంటే బనగానపల్లె వైఎస్ఆర్పి మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసి తన అనుచరులకు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నారని వీటి పైన రెవిన్యూ అధికారులు సమగ్ర విచారణ చేసి అరులైన లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు,ఇండ్ల పట్టాలుఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురైన వారికి రెవిన్యూ అధికారులు పరిశీలన చేసి తగిన న్యాయం చేయాలని పై నాయకులు కోరారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580317
Total Users : 48001