ఆంధ్రప్రదేశ్
పెన్షన్ అంటే గుర్తుకు వచ్చేది ఎన్ టీ ఆర్ యే : నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
పెన్షన్ పెంచి పేదల జీవితాల్లో వెలుగునింపింది సీఎం చంద్రబాబు నాయుడే.
రాష్ట్రంలో పెన్షన్ అంటే గుర్తుకు వచ్చేది ఎన్.టి.ఆర్ అని, పేదలను ఆదుకునేందుకు, వారికీ మనోధైర్యం కల్పించేందుకు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మొట్ట మొదటి సారి రాష్ట్రంలో పెన్షన్ స్కీమ్ ప్రవేశపెటారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి గుర్తు చేసుకున్నారు.
శనివారం నంద్యాల జిల్లా పాములపాడు, ఎర్రగూడూరు గ్రామాల్లో ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్లను ఎంపీ బైరెడ్డి శబరి అర్హులైనవారికీ పంపిణి చేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్ట మొదటి సారి వృద్దులు, వికలాంగులు, వితంతువులు, తదితర అర్హులైన వారిని గుర్తించి నెలకు ప్రభుత్వం రూ.50 లు అందించిన భరోసా కల్పించిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని ఎంపీ శబరి అన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన వారి పెన్షన్ గతం కంటే రెట్టింపు పెంచి ప్రతి నెల 1 వ తేదిన వారి ఇంటి వద్దకే వచ్చి అందించడం అభినందనీయం అన్నారు. ఈ నెల 1 వ తేది ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్ అందించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. పేదరిక నిర్ములనకు ఈ పెన్షన్ పెంపు ధోహదం చేస్తుందని, ఎక్కడా అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా లబ్ధిదారులు ఇంటికి వెళ్లి ప్రభుత్వ ఉద్యోగులు వృద్ధులు, దివ్యాంగులు, వితంతు, వంటరి మహిళా, డప్పు, గీత కార్మికులకు, హిజ్రాలకు, ధీర్గకాలిక వ్యాధితో బాధపడేవారికి పెన్షన్ అందించడం గొప్ప యజ్ఞం లాంటిదని, ఈ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఎంపీ శబరి అన్నారు.
ఈ పెన్షన్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డా. కాకరవాడ చిన్న వెంకటస్వామి, నాగేశ్వరావు, శ్రీనివాసులు, కురువ ఎల్లయ్య, కురువ రమేష్, శివానందరెడ్డి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక